8లో
జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన పట్టణం.. ఐటీడీఏ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై ఉన్న కేంద్ర స్థానం.. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే పారిశుధ్యం పడకేసి మురుగు నిలయంగా దర్శనమిస్తోంది. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా నిర్వీర్యమవడంతో పురవీధులన్నీ నరకకూపాలుగా మారాయి. డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక, వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఈగలు, దోమల బెడద తీవ్రమై, పట్టణ ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల భయంతో అల్లాడిపోతున్నారు.


