అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో తల లేని మృతదేహం లభించింది. గోస్తనీ నది ఒడ్డున తుప్పల్లో ఉన్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వ్యక్తులు గుర్తించారు.ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. తలను నరికి ఎవరు తీసుకువెళ్లారు?, మరణించిన వ్యక్తి స్థానికుడా? పర్యాటకుడా ? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అరకులోయ సీఐ ఎల్.హిమగిరి మాట్లాడుతూ గోస్తనీ నది ఒడ్డున పురుషుడి తల లేని మృదేహం లభించినట్టు చెప్పారు. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య మృతుడి వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 6 అంగులాలు ఉండవచ్చన్నారు. కుడి చేతిపై అమ్మ, నాన్న అనే టాటు ఉందని, శరీరంపై దుస్తులు లేవన్నారు. మృతదేహాన్ని శవపంచనామ కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని, అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ హిమగిరి తెలిపారు.


