విశాఖ స్పోర్ట్స్: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్లాల్ నెహ్రూ, దీన్దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి.


