శ్రీశైలం ఏఎస్‌ఐ కొండబాబు గుండెపోటుతో మృతి | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఏఎస్‌ఐ కొండబాబు గుండెపోటుతో మృతి

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

కొయ్యూరు: శ్రీశైలంలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న మంప గ్రామానికి చెందిన వంజరి కొండబాబు (45) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో మంప గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీశైలంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న కొండబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం పాయకరావుపేటలో చదువుకుంటున్న తన కుమారుడిని పరామర్శించి, తిరిగి స్వగ్రామమైన మంపకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్‌ అధికారిగా గుర్తింపు పొందిన కొండబాబు అకాల మరణం పట్ల స్థానికులు, తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement