చింతపల్లి: ఉన్నత సేవలతోనే మంచి గుర్తింపు ఉంటుందని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. లంబసింగి గిరిజన సంక్షేమ బాలకల ఆశ్రమ పాఠశాలలో పదవీ విరమణ పొందిన పీజీ హెచ్ఎం (పానల్ గ్రేడ్ హెచ్ఎం) జక్కు శంకరరావు దంపతులను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 34 ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ జక్కు శంకరరావు ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారన్నారు. ఉన్నత ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకోగలగారన్నారు. ఈ సందర్భంగా పలువురు శంకరరావు సేవలను కొనియాడారు. పీజీ హెచ్ఎంలు రాజు, సాగిన రామరాజు పడాల్, సింహాచలం, రాజంనాయుడు, పూర్వ విద్యార్థులు నూకరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


