ద్విచక్రవాహనం బోల్తా – ఒకరి మృతి
● ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముంచంగిపుట్టు మండలం మారుమూల భూసిపుట్టు పంచాయతీకి సమీపంలోని ఒడిశా ప్రాంతంలో జన్భై వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో బుంగాపుట్టు పంచాయతీ కేంద్రానికి చెందిన అల్లంగి సుకు(32), బర్మన్గూడకు చెందిన సురేష్బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరిని రూడకోట పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందించారు.అక్కడ నుంచి పెదబయలు పీహెచ్సీకి తరలిస్తుండగా సుకు మార్గం మధ్యలో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న సురేష్బాబు పెదబయలు పీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్నాడు.


