అప్పన్న అన్నప్రసాద పథకానికి విరాళాలు
బాండు అందుకుంటున్న దాత రామారావు, శ్రీకాంత్లకు బాండ్ అందిస్తున్న సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి సింహాద్రినగర్కి చెందిన కె.రామారావు అనే దాత రూ.లక్ష 116, ఎండాడ ప్రాంతానికి చెందిన అమ్ము శ్రీకాంత్ అనే మరో దాత రూ.లక్ష 1,101 విరాళాన్ని నగదు రూపంలో అందజేశారు. దేవస్థానం తరఫున పీఆర్వో కార్యాలయ ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ దాతలకు బాండ్లు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రంలు అందజేశారు. పీఆర్వో అప్పలనాయుడు పాల్గొన్నారు.
అప్పన్న అన్నప్రసాద పథకానికి విరాళాలు


