పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

Jan 5 2026 8:05 AM | Updated on Jan 5 2026 8:05 AM

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు ప్రభావం కొనసాగుతోంది. చలి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆదివారం జి.మాడుగులలో 9.3 డిగ్రీలు, అరకువ్యాలీలో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

● పాడేరు డివిజన్‌ పరిధి చింతపల్లిలో 10.0 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 10.9 డిగ్రీలు, పాడేరులో 11.2 డిగ్రీలు, పెదబయలులో 11.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.1 డిగ్రీలు, కొయ్యూరులో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 14.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.

పోలవరం జిల్లాలో

రంపచోడవరం డివిజన్‌ వై.రామవరంలో 12.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.3 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.5, అడ్డతీగలలో 15.5 డిగ్రీలు, రంపచోడవరంలో 16.8 డిగ్రీలు, చింతూరు డివిజన్‌ చింతూరులో 15.3 డిగ్రీలు, ఎటపాకలో 17.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన తెలిపారు.

● గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, చిరువ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో 9 గంటలు దాటే వరకూ పొగమంచు తెరలు వీడటం లేదు.

డుంబ్రిగుడ: మండలంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది.దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

జి.మాడుగులలో 9.3 డిగ్రీల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement