టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

Dec 2 2025 8:30 AM | Updated on Dec 2 2025 8:30 AM

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ పరిమళ

చింతపల్లి: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇవ్వాలని పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ పరిమళ అన్నారు. సూపర్‌ 50 లో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న చింతపల్లిలో బాలుర,బాలికల ఆశ్రమ పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడేరు డివిజన్‌ పరిధిలో ప్రతిభ కనబరిచిన 100 మంది టెన్త్‌ విద్యార్థులను గుర్తించి, వారికి మోదాపుట్టు, గుత్తులపుట్టు, చింతపల్లి బాలికల, బాలుర ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ తరగతులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పదవ తరగతితో పాటు భవిష్యత్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన నైపుణ్యతను అందించే విధంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం జూనియర్‌ కళాశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం హెచ్‌డబ్యువోలు ఆమెను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్‌,బి.వి.జి.ఎన్‌. రాజు,వార్డెన్‌లు రత్నం, తిరుపతిరావు, గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement