చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి

Oct 15 2025 5:48 AM | Updated on Oct 15 2025 5:48 AM

చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి

చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి

చింతూరు : చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చిడుమూరు గ్రామంలో జరిగింది. చింతూరు ఎస్‌ఐ పేరూరి రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొక్కలి మల్లయ్య మనుమరాలు అనారోగ్యానికి గురైంది. ఇందుకు అదే గ్రామానికి చెందిన దురవా పిచ్చయ్య చేతబడి చేయడమే కారణం అన్న అనుమానంతో అతనిపై మల్లయ్య కత్తితో దాడి చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన పిచ్చయ్య చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement