నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన

Jun 13 2025 5:33 AM | Updated on Jun 13 2025 5:33 AM

నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన

నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన

గంగవరం : పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుటిందని పందిరిమామిడి పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.రాజేంద్రప్రసాద్‌, కె.వీరాంజనేయులు తెలిపారు. గురువారం కుసుమరాయి గ్రామంలో పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, రాజమండ్రి భారతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆముదాలబంద సర్పంచ్‌ పాయం రాజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరితోపాటు శాస్త్రవేత్త కె.సుమన్‌ కల్యాణ్‌ రైతులకు పలు సూచనలు చేశారు. సీటీఆర్‌ఐ శాస్‌త్రవేత్తలు డాక్టర్‌ కస్తూరి, కృష్ణ డాక్టర్‌ రవిశంకర్‌, మండల వ్యవసాయాధికారి విశ్వనాథ్‌, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సీనియర్‌ శాస్త్రవేత్తలు రాజేంద్రప్రసాద్‌, వీరాంజనేయులు

సదస్సు నిర్వహించిన పందిరిమామిడి శాస్త్రవేత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement