
మొక్కుబడి
కూటమి ప్రభుత్వ చర్యలపై విద్యార్థుల ఉసూరు
పంపిణీలో ఘోరంగా విఫలం
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు, బ్యాగులు, ఇతర కిట్లు అన్ని పంపిణీ జరిగేది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యా కిట్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బ్యాగులు లేకుండా పుస్తకాలు ఇస్తే వాటిని విద్యార్థులు ఎలా తీసుకువెళ్తారో విద్యాశాఖమంత్రి లోకేష్కు తెలియాలి. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం సరికాదు.
– లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, పాడేరు
సాక్షి,పాడేరు: ప్రభుత్వ పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటన ప్రచారానికే పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా పుస్తకాలు మినహా బ్యాగులు, యూనిఫాం, బెల్టులు, బూట్లు, సాక్సులు పంపిణీ చేసిన పరిస్థితులు కనిపించలేదు.
గత ప్రభుత్వంలో ముందు చూపుతో..
గత విద్యాసంవత్సరంలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు చూపుతో అలోచించి మే నెల నాటికే విద్యా కానుక కిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులతో పాటు పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది.అ యితే ఈఏడాది మాత్రం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులు విద్యా కిట్లను పొందలేక పోయారు. హాజరుశాతం తక్కువగా ఉన్నప్పటికీ వచ్చిన వారికి చాలాచోట్ల పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. పాఠశాలలకు పుస్తకాలు తరలింపులోను జాప్యం ఏర్పడింది.
ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం..
జిల్లా వ్యాప్తంగా 2,913 పాఠశాలల్లో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్ కిట్లను పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు ఉసూరుమన్నారు. మొత్తం విద్యార్థులు 1,69,175మందికి సరిపడ బ్యాగులను ప్రభుత్వం అందుబాటులోకి తేలేకపోయింది. ఇప్పటివరకు 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫారం, 24,886 బూట్లు, 24,886 సాక్సులు, 1,31,673 బెల్టులు మాత్రమే జిల్లాకు చేరాయి. పూర్తిస్థాయిలో కిట్లు రాకపోవడంతో ఇవన్నీ మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం అయ్యాయి. కిట్లు పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత వాటిని విద్యార్థులకు అందజేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో రావడానికి కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగానే ఉంది. వారికి కూడా కిట్లు అందలేదు.
విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టింది. స్కూళ్లు ప్రారంభం నుంచి విద్యార్థులకు అన్ని సౌకర్యాలుఅందుబాటులోకి తెచ్చి విద్యాప్రమాణాల మెరుగుకు ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం చర్యలు మాత్రంఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాఠశాలలు పునః ప్రారంభ రోజునుంచే విద్యార్థులకు కష్టాలుమొదలయ్యాయి. విద్యామిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ వీటి జాడ కానరాలేదు. పుస్తకాల పంపిణీ అరకొరగా సాగింది. సన్నబియ్యంతోనాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పినా చాలాపాఠశాలల్లో విద్యార్థులు ముద్దయిన అన్నం తినాల్సి వచ్చింది.
ముద్దవుతున్న సన్నబియ్యం
కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సన్నబియ్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పాఠశాలలకు జీసీసీ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటితో సిద్ధం చేసిన అన్నం ముద్దగా ఉంటోంది. పాడేరు మండలం రాములపుట్టు పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూరలు, సాంబారు బాగున్నప్పటికీ ముద్దయిన అన్నం తినేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాక్షి పరిశీలనలో చాలా పాఠశాలల్లో ఇదే కనిపించింది.
దేవీపట్నం మండలం సీతారాం ఎంపీపీ పాఠశాలలో విద్యార్ధులకు యూనిఫాం, బూట్లు పంపిణీ కాలేదు
అరకులోయ మండలం బోసుబెడ పాఠశాల, అరకు పట్టణంలోని ఉన్నత పాఠశాలల్లో బ్యాగులు, పుస్తకాలు,ఇతర సామగ్రి పంపిణీ జరగలేదు.
డుంబ్రిగుడ మండలంలోని కిల్లోగుడ, అరకు, డుంబ్రిగుడ ఉన్నత పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి పంపిణీ చేయలేదు.
పెదబయలు మండలం గోమంగి ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాగులు, బూట్లు,ఇతర సామగ్రి పంపిణీ కాలేదు. సన్నబియ్యం పంపిణీ కాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తమ వద్ద ఉన్న బియ్యంతో పిల్లలకు ఆహారం తయారు చేశారు.
అరకొరగా పుస్తకాల పంపిణీ
సరఫరా కాని బ్యాగులు, బూట్లు
ముద్దయిన సన్నబియ్యం
తల్లుల ఖాతాల్లో జమకాని
తల్లికి వందనం నగదు
కూటమి ప్రభుత్వ ప్రకటన
ప్రచారానికే పరిమితం

మొక్కుబడి

మొక్కుబడి

మొక్కుబడి