
రక్తదాన శిబిరానికివిశేష స్పందన
21 యూనిట్ల సేకరణ
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ హౌస్ అతిథి గృహంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఇండియాన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఆర్వో పద్మలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్బాషా, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహులు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పశుసంవర్థక శాఖ ఉద్యోగులు 21 యూనిట్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ షరీఫ్, డాక్టర్ రాఘవేంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు, సభ్యులు ప్రసాధ్నాయుడు పాల్గొన్నారు.