
వైద్య విద్యార్థుల రక్తదానం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు రక్తదానంలో పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరంలో15 మంది వైద్య విద్యార్ధులు రక్తదానం చేశారు. ఈసందర్భంగా వారిని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి అభినందించారు. సేకరించిన రక్తాన్ని పాడేరు బ్లడ్బ్యాంకుకు తరలించారు.ఈ కార్యక్రమంలో బ్లడ్బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ రాఘవేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, ప్రధాన కార్యదర్శి జి.గౌరిశంకర్,కోశాధికారి పల్టాసింగి సూర్యారావు, సభ్యులు తమర్భ ప్రసాద్నాయుడు, సంజీవరావు, రవి, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, పలువురు వైద్యులు పాల్గొన్నారు.