
సేవల్లో స్ఫూర్తి
వైద్యపరంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రాణదీప్తిగా నిలుస్తోంది పాడేరు రెడ్క్రాస్ సొసైటీ. ప్రజల్లో చైతన్యం నింపుతూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రోజురోజుకు సేవలను విస్తరిస్తోంది. పాడేరు కేంద్రంగా సేవలందిస్తూ జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2624 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.
ప్రాణదీప్తి..
రక్తబంధువు
కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వొచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి.
ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్
ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది.
● ఆదర్శంగా రెడ్క్రాస్ సొసైటీ సేవలు
● అత్యవసర పరిస్థితుల్లో కీలకపాత్ర
● విజయవంతంగా 68 రక్తదాన
శిబిరాల నిర్వహణ
● జిల్లావ్యాప్తంగా 2,624 యూనిట్ల
సేకరణ
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
సాక్షి, పాడేరు: రెడ్క్రాస్ సొసైటీ సేవలు ఇక్కడ అందుబాటులో లేనప్పుడు ఏజెన్సీ ఆస్పత్రుల్లోని రోగులకు రక్తం అవసరం ఉంటే విశాఖలోని కేజీహెచ్కు రిఫర్ చేసేవారు. మైదాన ప్రాంత బ్లడ్బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి స్థానికంగా ఉండే బ్లడ్ స్టోరేజీ పాయింట్లలో భద్రపరిచేవారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు పడేవారు.
వైఎస్సార్సీపీ హయాంలో..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీ సేవలను 2022లో ఇక్కడికి విస్తరించింది. పాడేరు కేంద్రంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున సేకరణ చేపట్టింది. చైతన్యం పెరగడంతో రక్తదానం చేసేందుకు యువతీ యువకులు ముందుకు వస్తున్నారు.రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ విభాగం, వలంటీర్లు రక్తదానంపై విస్తృత ప్రచారం చేయడం రక్తసేకరణలో రెడ్క్రాస్ సొసైటీకి ఎంతో ఉపకరిస్తోంది. జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాతల నుంచి 2624 యూనిట్లు సేకరించింది.
నాలుగు చోట్ల బ్లడ్ బ్యాంకులు: బ్లడ్ స్టోరేజీ పాయింట్ల స్థాయి నుంచి బ్లడ్ బ్యాంక్ స్థాయికి సేవలు విస్తరించాయి. జిల్లాలో పాడేరు జిల్లా ఆస్పత్రి, అరకులోయ, రంపచోడవరం, చింతూరు ఏరియా ఆస్పత్రుల్లో గత ప్రభుత్వంలోనే బ్లడ్ బ్యాంక్లు ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లో రక్తం క్యూరేషన్తో పాటు రక్తం నిల్వలను భద్రపరిచి జిల్లా వ్యాప్తంగా అత్యవసర సమయంలో రోగులకు సరఫరా జరుగుతోంది. చింతపల్లి, ముంచంగిపుట్టు, కూనవరం సీహెచ్సీల్లో కూడా బ్లడ్స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు అయ్యాయి.
యువకులకు అభినందన
పాడేరు ప్రాంతానికి చెందిన జి.సంతోష్కుమార్, ఎస్.వికాస్ అనే యువకులు 26 సార్లు రక్తదానం చేశారు. అలాగే పి.రాజు 18సార్లు, ఒ.సుమన్ 17 సార్లు రక్తదానం చేశారు. వీరందరినీ పాడేరు వైద్య కళాశాలలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా వారిని అభినందించారు. ఉత్తమసేవా పత్రాలను అందజేశారు.
రక్తదానం చేయాలంటే..
పూర్తిస్థాయిలో రక్త నిల్వలు
జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంకులో నిరంతరం రక్తం నిల్వలు అందుబాటులో ఉంటున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ శిబిరాలలో సేకరించిన రక్తాన్ని స్థానికంగా గర్భిణులు, రక్తహీనత రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. బ్లడ్ బ్యాంకులో కనీసం 10 యూనిట్ల వరకు పలు గ్రూప్ల రక్తం నిల్వ ఉంటుంది.
– డాక్టర్ విశ్వమిత్ర,
సూపరింటెండెంట్, జిల్లా సర్వజన ఆస్పత్రి
ప్రజల్లో చైతన్యం పెరిగింది
జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. రక్తదానంపై ఉన్న ఆపోహలను పక్కనబెట్టి రక్తదాన శిబిరాలకు యువకులు, విద్యార్ధులు, అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ పాడేరులో ఏర్పాటు చేసిన నాటి నుంచి కలెక్టర్ అధ్యక్షతన రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతమయ్యాయి.
– గౌరీశంకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి,
రెడ్క్రాస్ సొసైటీ, పాడేరు

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి

సేవల్లో స్ఫూర్తి