
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 13 మంది ఎంపిక
సాక్షి,పాడేరు: స్థానిక తలారిసింగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. యోగా నోడల్ అధికారి, ఎస్డీసీ లోకేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహనరావు పర్యవేక్షణలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. మూడు ఐటీడీఏల పరిధిలో 13ఆంశాల్లో యువతీ,యువకులు,పలు పాఠశాలల విద్యార్ధులు యోగా చేశారు. వీటిలో 13మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.