తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్‌, దాసరి రమేశ్‌, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, మమత, కరుణ, సలీమ్‌, ధమ్మపాల్‌, గణేష్‌, పరమేశ్వర్‌, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement