కై లాస్నగర్: భగీరథ మహర్షి జయంతిని గురువా రం అఽధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజ ర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లాలోని సాగర, ఉప్పర కులస్తులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ కులస్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఘనంగా సీపీఐఎంఎల్ ఆవిర్భావ వేడుకలు
ఆదిలాబాద్టౌన్: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆ ధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ 57 ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లెనిన్ జయంతి సందర్భంగా బుధవారం నిషాన్ ఘాట్లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ ఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యదర్శివర్గ స భ్యు డు జగన్సింగ్ మాట్లాడారు. భారతదేశ వి ము క్తి కోసం మార్క్సిజం, లెనినిజం, మావో ఆ లో చన విధానాల వెలుగులో అనేకమంది ప్రా ణా లు త్యాగం చేశారని గుర్తుచేశారు. భూమి, భు క్తి, దేశ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల ను మాస్ లైన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. నాయకులు నితిన్, వామన్, శీను, రేణుక, లక్ష్మి, వనిత తదితరులున్నారు.


