ఈనెల 22 నుంచి పోరుబాటలో ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఆందోళన అనివార్యమైతే ప్రయాణికులకు తిప్పలే..
ఆదిలాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమపై చిన్నచూపు చూస్తోందంటూ పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సమాయాత్తం అవుతున్నారు. ఈ నిరసన నిరవధికంగా కొనసాగితే ప్రజా రవాణాకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఆర్టీసీకి సైతం రూ.కోట్లల్లో నష్టం వాటిల్ల నుంది. కార్మికులతో క్షేత్రస్థాయిలో చర్చిస్తున్న అధి కారులు సమ్మె విరమింపచేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
రీజియన్ పరిధిలో మొత్తం ఉద్యోగులు :1946
బస్సులు: 641


