ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి.


