ఆదిలాబాద్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పు నర్విభజన, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీ సీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్ద రు సర్వేల పేరుతో బీసీలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉ న్నారని పేర్కొన్నారు. సమావేశంలో వసంత్, రమేష్, అశోక్ స్వామి, జగదీష్, గంగయ్య, రా ము,ప్రశాంత్,కలీమ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.


