ఆదిలాబాద్టౌన్: పట్టణంలో నిర్వహించిన శోభా యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక టీ ఎన్జీవో గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. సుమారు 300 మంది సి బ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ర్యాలీ మార్గాల్లో డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా ని ఘా కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. అనంత రం శోభాయాత్రను డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఇందులో అదనపు ఎస్పీ బి. సు రేందర్ రావు, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు, ఇతర పోలీస్అధికారులు పాల్గొన్నారు.


