తాంసి: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్ఐ సంతోష్ కుటుంబాన్ని కలెక్టర్ రాజర్షిషా గురువారం పరామర్శించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తు న్న సంతోష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గా యపడి చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కాగా, భీంపూర్ మండలంలోని క రంజి(టి) గ్రామానికి జిల్లా అధికారులతో వెళ్లి సంతోష్ కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించా రు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, భీంపూర్, తాంసి తహసీల్దార్లు రమేశ్, లక్ష్మి, కలెక్టరేట్ ఏవో వర్ణ, రెవెన్యూ అధికారులు కార్తిక్, రాజేశ్వర్, కుటుంబ సభ్యులు సంగీత, చంద్రశేఖర్, రుతిక్ తదితరులున్నారు.


