సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేసింది. దీని ప్రకారం భూమి విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలు చేసిన వ్యక్తి సెల్ఫ్ అఫిడవిట్ అందిస్తే సరిపోతుంది. అందులో ఏమైనా తప్పని తేలితే వారినే బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసేదిశగా ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిబంధనల ప్రకారం కబ్జాలో ఉండి భూములు కాస్తూ చేస్తున్న అర్హులైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వం. వారికి తప్పనిసరిగా భూహక్కు కల్పిస్తాం.
– ఎస్.రాజేశ్వర్,
అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)


