ఆదిలాబాద్: శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర మఠం నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న శ్రీ భవ్య రామ శోభాయాత్రను జయప్రదం చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేంద్ర కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పడానికి, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు మహేందర్, సురేందర్, మనోజ్ పవర్, సచిన్, చాణక్య, అభియాదవ్, స్వప్నిల్, కిరణ్, సంతోష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


