కై లాస్నగర్: ఎలాంటి పరిమితి లేకుండా శనగ పంట కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కమి టీ సభ్యురాలు సుహాసినిరెడ్డి కోరారు. కలెక్టర్ రాజర్షిషాను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ, గ్రామాల్లో ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాములు లేక, ఇళ్లలో పె ట్టలేక, అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి రూ.10వేలు పరిహారం అందించాలని కోరా రు. వరికి మాదిరిగా అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని విన్నవించారు.


