రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి

May 24 2025 12:35 AM | Updated on May 24 2025 12:35 AM

రాష్ట్రస్థాయిలో    ప్రతిభ కనబరచాలి

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి

ఆదిలాబాద్‌: జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పో టీల్లో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నూ ప్రతిభ కనబరచాలని డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్‌ జూని యర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారన్నారు. అండర్‌ –8, 10, 12 విభాగంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపికై న వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు వివరించారు. ఇందులో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి రాజేశ్‌, ఎస్జీఎఫ్‌ సెక్రెటరీ కాంతారావు, పెటా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్‌, రాకేష్‌, సౌమ్య, జ్యోతిస్వరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement