
‘భూభారతి’తో భూసమస్యలకు పరిష్కారం
తాంసి: భూభారతి చట్టంతో రైతుల భూసమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు భూహక్కులు భద్రంగా ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. గురువారం మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పాటను ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అందరికీ అవగాహన ఉండాలని సదస్సులు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ధరణి స్థానంలో భూమి హక్కుల కోసం భూ భారతి ప్ర భుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు. చట్టం విధి విఽ దానాలను రైతులకు వివరించారు. భీంపూర్ మండలంలోని గుంజాల, కరంజి(టి) గ్రామాల్లో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులు పట్టాలు లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా భూభారతి చట్టం ద్వా రా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ నలందప్రియ, మండల ప్రత్యేకాధికారి కిషన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర రోడ్డు పరిశీలన
భీంపూర్ మండలంలోని ధనోర నుంచి వడూర్ గ్రామాల మధ్య గుంతలుగా మారిన అంతర్రాష్ట్ర రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. గుత్తేదారుతో ఫోన్లో మాట్లాడి నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాల ఏర్పాటుకు భీంపూర్ శివారులో స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్.సర్వేయర్ మనోజ్, తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రాజర్షి షా