ద్విచక్ర వాహనం అదుపు తప్పి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బాలుడి మృతి

Oct 8 2024 12:46 AM | Updated on Oct 8 2024 1:58 PM

-

రాజంపేట : పట్టణంలోని పాతబస్టాండు సర్కిల్‌లో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఓ బాలుడు మృతి చెందాడు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం దంపతులకు పుత్రశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. రైల్వేకోడూరు నియోజకవర్గం చిన్నఓరంపాడు కాలనీకి చెందిన బాబురావ్‌ , శిరీషాలకు పెద్దకుమారుడు శ్యామ్‌.

 బాలుని చికిత్స నిమిత్తం ద్విచక్రవాహనంలో రాజంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. తిరుగు పయనంలో పాతబస్టాండు సర్కిల్‌ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పింది. దీంతో బాలుడు గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దంపతుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలుడి మృతి ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement