breaking news
yuvaraitu
-
ఈ నడక చట్టాన్ని తెచ్చేందుకు..
సత్వర న్యాయం కోసం ఓ రైతు పాదయాత్ర నెల్లూరు నుంచి ఒంగోలుకు చేరిన పాదయాత్ర తెలుగు రాష్ట్రాల సీఎంలకు విన్నవించేందుకు కంకణం ఒంగోలు టౌన్ : ‘ఉప్పు దొరకని ఊరున్నా ఫర్వాలేదు. న్యాయం దొరకని ఊరంటూ ఉండకూడదని’ ఓ యువ రైతు పాదయాత్ర ప్రారంభించారు. ‘ఈ నడక చట్టాన్ని తెచ్చేవరకు’ అనే ఫ్లెక్సీని భుజంపై మోసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన ఎన్.శ్రీహరి అనే యువ రైతు సత్వర న్యాయం కోసం ఐదు రోజుల క్రితం తన గ్రామం నుంచి బయలుదేరాడు. ముందుగా విజయవాడ చేరుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవాలని, ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసి సత్వర న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవాలని నిర్ణయించాడు. అందులో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల నుంచి నగరాల వరకు రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒకవిధంగా గొడవలు జరగడం, అవి ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, భూముల గొడవలు.. ఇలా సంఘటనలు ఏమైనా సత్వర న్యాయం లేకపోవడం వల్ల అనర్థాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిన్న గొడవ జరిగినా, పెద్ద గొడవ జరిగినా రచ్చబండకు తీసుకువచ్చి సత్వర న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎలాంటి సంఘటన అయినా నెలలు, సంవత్సరాలు పడుతోందన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ప్రతి గ్రామంలో న్యాయం సమీక్షించేవిధంగా ఒక కమిటీ ఉండాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న న్యాయ కమిటీ ఎప్పటికప్పుడు తమ గ్రామాల్లో సమస్యలపై చర్చించి సత్వర న్యాయం అందించేలా చూడాలన్నారు. న్యాయ సమీక్ష చేసే సమయంలో దానిని వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. న్యాయ కమిటీ తప్పు చేస్తే అందులో ఉండేవారిని శిక్షించేందుకు వెనుకాడరాదన్నారు. ఈ న్యాయ కమిటీలో విద్యావంతులను నియమించి నిర్ణీత కాలవ్యవధి ఉండేలా చూడాలన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు జనసేన అధినేత పవన్కళ్యాణ్ను కలిసి ఈ విషయాలను విన్నవించనున్నట్లు శ్రీహరి చెప్పారు. -
కాటేసిన కరెంట్ తీగలు
విద్యుత్ తీగలు ఇద్దరిని పొట్టన బెట్టుకున్నాయి.. వీరిలో ఒకరు యువరైతు, మరొకరు వాటర్మన్ ఉన్నారు.. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. చేతికొచ్చిన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కలచివేసింది.. హృదయ విదారకమైన ఈ సంఘటనల వివరాలిలా ఉన్నాయి. గట్టు / తిమ్మాజీపేట : గట్టు మండలం ఆలూరుకు చెందిన కుమ్మరి కిష్టప్ప, మంగమ్మ దంపతులకు ము గ్గురు కుమారులు ఉన్నారు. వీరికి సమీపంలోనే ఐదెకరాల పొలం ఉంది. అందులో రెండు బో ర్లు వేసి వరి, పత్తి సాగు చే స్తున్నారు. పొలం దగ్గ రే గుడిసె వేసుకున్నారు. ఎప్పటిలాగే ఆది వారం ఉదయం అన్నదమ్ములు మహేష్ (20), రాజు, తండ్రి కిష్టప్పతో కలిసి బైక్పై తమ పొ లానికి వెళ్లారు. బోరు మోటార్ దగ్గర తండ్రి, త మ్ముడు దిగి పోగా, అన్న మాత్రం వాహనాన్ని కొద్దిదూరంలో ఉన్న గుడిసెలో పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే దారిలో తెగి పడిన సర్వీస్ వైరును పక్కకు తీసి వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి వారొచ్చి చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో కుటుంబం లో విషాదం నెలకొంది. మరో సంఘటనలో తిమ్మాజీపేట మండలం మరికల్కు చెందిన భ గవంతు (30) సమీపంలోని 220 కేవీ సబ్స్టేష న్ నిర్మాణ పనుల వద్ద ఏడాది కాలంగా వాటర్మన్గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య భూ దేవి, కుమారుడు ఉన్నారు. భార్య అక్కడే వం ట మనిషిగా పనిచేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్ మధ్యకు వెళ్లి అతను సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెం దాడు. అనంతరం బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్గౌడ్ పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.