breaking news
woman farmers
-
వారి కోసం ఎం అండ్ ఎం కొత్త ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా మహిళా రైతుల కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రేరణ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు ప్రోత్సాహ్నన్నందించే దిశగా ఈ పథకాన్ని లాంచ్ చేసినట్టు మహీంద్ర అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో తెలిపింది. 19 బిలియన్ డాలర్ల వ్యయంతో మహిళలకు మెరుగైన వ్యవసాయ సామగ్రి అందించడం, ప్రచారం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ మహిళా రైతులు ఎదిగేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు, సమర్థతా వ్యవసాయ పరికరాలను, సామగ్రిని అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళా రైతుల సాధికారత సాధన, మద్దతు అందించనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. 30కి పైగా గ్రామాల్లో 1,500 కుటుంబాలపై ప్రభావం చూపే ఉద్దేశంతో ఈ ప్రేరణ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్ర సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ (CIWA), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఎన్జీవో ప్రధాన్ (ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్) ల సంయుక్త సహకారంతో ప్రెన్నాలో మొదటి ప్రాజెక్ట్ను రూపొందించింది. 100 మిలియన్ల మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారని, వీరిలో చాలామంది పొలాలలో ఎక్కువ సమయం పనిచేసేవారేనని తెలిపింది. అలాగే వీరికి అనువైన వ్యవసాయ సాధనాలు, ఇతర పరికరాలు చాలావరకు అందుబాటులో లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రేరణ పథకంలో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా కింద ఈ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. -
మహిళా రైతుల హక్కులను పటిష్టం చేయాలి
అనంతపురం రూరల్: మహిళా రైతుల హక్కులను ప్రభుత్వాలు పటిష్టం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని ఎకాలజీ కేంద్రంలో వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర, వారి హక్కులపై మహిళ కిసాస్ అధికార్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలతో కుటుంబ భారం మొత్తం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి రైతు భార్యపై పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వాలు చేయూతను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రుణభారం పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. భర్త మరణించిన తర్వాత అతనికి చెందిన భూమి మా పేరిట లేక రుణమాఫీ కావడంలేదని పలువురు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి మహిళా రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీఏ శ్రీరామమూర్తి, నాబార్డ్ ఏజీఎం రవీంద్ర, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజాతోపాటు పలువురు పాల్గొన్నారు.