breaking news
wild fruits
-
Sagubadi: కల్జివ్వ.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ వృక్షం!
కల్జివ్వి పండ్లు మేడి పండ్ల ఆకారంలో, సైజులో చిన్నగా ఉంటాయి. ఈ చెట్లకు బండజువ్వి, జువ్వి అనే పేర్లు కూడా∙ఉన్నాయి. బండజువ్వి రకం ఎక్కువగా బండకొరుకులు, మొరం నేలలో, చెట్లపై గమనించవచ్చు. జువ్వి, కల్జివ్వి ఒకటే అంటారు. ఈ జాతిలో పొదలు, గుల్మాలు, చెట్లు ఉన్నాయి. వీటిలో ఇతరాలు పైకస్ అసినిన, పైకస్ ప్యూజెసెన్స్, ఉరోస్టిగ్మ టొమెన్ టోసం మొదలగునవి ఉన్నాయి. ఉనికి: పండ్లు జూన్–జులై నెలల్లో వస్తాయి. మేడి పండ్ల చెట్టులో వలెనే ఇందులో కూడా పూలు బయటికి కనపడవు. వీటిల్లో కూడా చీమలు, కందిరీగలు ఫలదీరకణకు దోహదపడతాయి. వీటి పూలను గాల్ ఫ్లవర్ అని అంటారు. ఈ చెట్ల పూలల్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి మొగ్గ, పొడవాటి కాడ ఆడ, కురుచ కాడ ఆడ పువ్వులు ఉంటాయి. ఈ చెట్టు దాదాపు 12 మీటర్ల ఎత్తు వరకు పెరగలదు. వీటి పక్క కొమ్మలకు నూగు పోచలుంటాయి. ఆకుల తొడిమ దగ్గర పండ్లు వస్తాయి. ఇవి మైదాన ప్రాంతాల్లో, అడవుల్లోనూ పెరుగుతాయి. ఇంచుమించు అన్ని నేలల్లో వస్తాయి. ఈ చెట్లు సామాన్యంగా సతతహరితంగా ఉంటాయి. కానీ కాలం అనుకూలించకుండా ఉంటే ఆకులు రాల్చుతుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉష్ణమండలం, ఉప–ఉష్ణమండలం ప్రాంతంలో వీటి ఉనికి ఉంటుంది.కానీ ఇవి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో ఉన్నట్లు గుర్తించారు. భారత్లో మాత్రం అండమాన్, నికోబార్ దీవులు, బీహార్, మధ్య–దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా నల్లమల అడవులు వీటికి పెట్టింది పేరు. వీటిపై జరిగిన ప్రయోగాలు చాలా తక్కువ. వీటిని సాగుకు మరల్చితే లాభసాటిగా ఉంటుంది. ఆకులను మేకలు, పశువులు తింటాయి!వీటి ఆకులు మేకలు, పశువులు తింటాయి. కరువు కాలాల్లో వీటిని మేతగా వాడతారు. పండ్లు తింటారు. కలప అంత గట్టిగా ఉండదు, వంట చెరకుగా వాడుకోవచ్చు. మాను లావు ఉంటే దాన్ని పెట్టెల తయారీకి వాడవచ్చు. ముఖ్యంగా పండ్ల రవాణకు ఉపయోగపడుతుంది. రోడ్లకు ఇరు పక్కలా ఈ చెట్లను నాటవచ్చు. ఈ చెట్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆకులను రుబ్బగా వచ్చిన రసాన్ని బొగ్గలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బెరుడును దంచగా వచ్చే గుజ్జును దెబ్బలకు, కోసుకుపోయిన చోట్ల రుద్దినట్లయితే అవి కొన్నిరోజుల్లో మానుతాయి. ఇప్పటికీ చెంచులు వైద్యంలో వాడుతున్నారు. ఈ జాతి మొక్కలను విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. బోన్సాయి (మరుగుజ్జు) మొక్కల పెంపకానికీ ఉపయోగించవచ్చు. ఈ జాతి పండ్లపై అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదనవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ చెట్టుతో పాములు పారిపోతాయి..
కలిమి పండు చాలా మందికి తెలిసిన పండే. కానీ కొండ ప్రాంతాలు, బంజరు భూములు, పొలంగట్లు మొదలగు ప్రాంతాల్లో వచ్చే కలిమి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.వీటికాయలు వగరు రుచి కలిగి ఉంటాయి. ఇవి నేరుగా తినటానికి అంత అనుకూలంగా లేకున్నా ఇతర ఉపయోగాలెన్నో ఉన్నాయి. పండుగా మారినప్పుడు తియ్యగా ఉండి (నలుపు రంగుకు మారుతుంది) తినటానికి యోగ్యంగా ఉంటుంది. ఈ కాయలు కోసినప్పుడు తొడిమ దగ్గర పాలు కారతాయి. కాబట్టి పండ్లను కడిగి తినటం మంచిది. పండ్లు గుత్తులుగా, ఒకటి, రెండుగా కూడా ఉంటాయి. పండ్లు బఠాణీ గింజ సైజు ఉంటాయి. మేలు రకమైన కలిమి పండ్లను ‘వాక్కాయ’లు అంటారు. ఇవి గచ్చకాయంత ఉంటాయి.‘కలిమి కాస్తే కాలం అవుతుంది’ అంటారు. అంటే.. సుభిక్షంగా పంటలు పండుతాయని రైతులు, పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం. కరువును తట్టుకొని నిలబడే సత్తా ఈ చెట్టుకుంది.శాస్త్రీయ నామం: క్యారస్స క్యరండస్కుటుంబం: ఆపోసైనేసికలిమి పండు పేర్లు: ఉరూ: కశౌండ ఒరియా: సుశేన కన్నడ: కవలి, హువు, కవలి కాయ్. గరిచే, గర్ని, గర్తి, కరండ, అస్సామీ: కరెంజా, కర్ణటెంగ ఇంగీష్: కరండస్ బెర్రి, క్రేన్ బెరీ, కరౌండ కరమకిరె తమిళం: కాలక్కాయి, కలక్కాయి తెలుగు: కలిమి, కలిమిక్కాయ, వాక్కాయ(పెద్ద పండ్లు) మరాఠీ: కర్వండ, కర్విండ, కాలిమైన, బోరోండ మలయాళం: కరక్కా పంజాబీ: గర్న బెంగాలీ: కరోంమ్చా హిందీ: కరోండ, కరౌండ, కరండ సంస్కృతం: కరమర్డ్, కరమర్ది, కరోండ అని పిలుస్తారు. ఇంగ్లాండ్లో కరండస్ ప్లం, ఇండోనేసియాలో కరండన్, కరెండంగ్ అని, చైనీస్లో కు హౌంగీ అని, పాకిస్తాన్లో గర్నే, కరండ, కక్రుండ అని, వియత్నాంలో క్యాసిరో, క్జోరో అని, మలేసియాలో బెరెండ, కరెండ, కరెండింగ్ అని పిలుస్తారు.పూత: ఏప్రిల్ – మే. పండ్లు కోత: నవంబర్– డిసెంబర్.ఉనికి:ఇది సతతహరిత ఆకులురాల్చే గుల్మం (పొదలాంటిది). నేల స్వభావాన్ని బట్టి 2–5 మీటర్ల ఎత్తు పెరగగలదు. గుబురైన మండలు (కొమ్మల), కురుచైన ముళ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని క్రిష్ థార్న్ అని అంటారు.గుత్తులుగా తెలటి పూలు, అందంగా ఉంటాయి. కాయలు కూడా గుత్తుగా కాస్తాయి. పెద్ద వాక్కాయ పండు నల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉండదు. అదే కలిమి (చిన్నది) పండు నల్లగానే వుంటాయి. కానీ రుచిగా ఉంటాయి.ఈ చెట్లు మన దేశంలో తూర్పు, పడమటి కనుమల అడవుల్లో, నేపాల్, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియాలోని దేశాల్లో ఉన్నాయి. వాక్కాయ చెట్లను మాత్రం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.వాక్కాయి చెట్టు ఆకులు పశుగ్రాసంగా పనికొస్తాయి..కలిమి చాలా ఉపయోగకరమైన చెట్టు. పెద్ద ఎత్తుగా పెరగకపోయినా ఎక్కువ పంగలు/కొమ్మలతో గుబురుగా ఉంటుంది. ముళ్లతో కూడుకున్న ఈ చెట్లను పొలం చుట్టూ కంచెగా బాగా పని చేస్తాయి.దీని వేర్లను దంచగా వచ్చిన లేపనాన్ని పశువుల పుళ్లపై రుద్దితే పురుగులు చనిపోయి పుళ్లు త్వరగా మానిపోతాయి.దీని వేర్లతో చేసిన పౌడరు/పొడిని నీళ్లలో కలిపి చల్లితే ఆ ప్రదేశాల నుంచి పాములు పారిపోతాయి.వీటి ఆకులను పూల దండల్లో అందం కోసం పెడతారు. త్వరగా వాడిపోవు.కాయలను పచ్చడి తయారు చేయటానికి, అట్లే పూలిహోరలో కూడా వాడుతారు. దీని పచ్చడికి మంచి గిరాకీ ఉంది.ఈ పండ్లతో జామ్, జల్లీ, పానీయాలు తయారు చేస్తారు.ఆకులు గొర్రెలు, మేకలకు గ్రాసంగా ఉపయోగపడతాయి.ట్యానింగ్ పరిశ్రమల్లో ఎండిన ఆకులను వాడుతారు.పండ్లు రుచికరంగా ఉండటం వల్ల పిల్లలు బాగా ఇష్ట పడతారు.ఈ చెట్టు బెట్టెను తట్టుకోగలదు, అన్ని నేలల్లో వస్తుంది.దీని పండ్లను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ముఖ్యంగా అసిడిటీ, అజీర్తి, పుండ్లు, చర్మవ్యాధులు, మూత్ర సంబంధిత, డయాబెటిక్ అల్సర్, కడుపు నొప్పి, అజీర్తి, రక్తహీనత, ఆకలి లేకపోవటం, పైత్యం, మనోవికల్పం మొదలగునవి నయం చేయటానికి వాడతారు.ఆకుల కషాయాన్ని, జ్వరాన్ని, విరేచనాలను, చెవి పోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.పోషక విలువలు మెండుకలిమి పోషక విలువలను గమనిస్తే చాలా విస్తృతంగా ఉంటాయి. విటమిన్–సి, విటమిన్ బిలు, ఇనుము ఉండటం వల్ల రక్తహీనత త్వరగా నయమవుతుంది. ఈ పండ్లలో మైరేడ్ యాంటిఆక్సిడెంట్స్, అవియే ఫ్లేవనాయిడ్స్, అల్కలాయిడ్స్, టానిన్స్, క్యారిస్సోన్, ట్రైటర్ ఫెనాయిడ్స్.. ఇవి ఉండటం వల్ల యాంటిపైరెడిక్, కార్డియోటానిక్, అనాల్జిన్ కారకాలుగా ఉపయోగపడతాయి.ఇందులోని పీచు పదార్థం ఉదర సంబంధిత రోగాల అదుపునకు ఉపయోగపడుతుంది. విటమిన్–సి జ్వరాలను అడ్డుకోడానికి, అదుపునకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని మెగ్నీషియం ఇతర విటమిన్లు, ట్రిప్టెఫాన్ వల్ల న్యూరోట్రాన్స్మిట్టర్ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి మానసిక వొత్తిడిని అదుపు చేసి ఆరోగ్యంగా ఉంచగలదు.కలిమి పండులో పెక్టిన్ అధికంగా ఉండడంవల్ల జాం, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.కాయల రసం మధుమేహ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ∙ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. ∙దంతాలు పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా కలిమి పండు కాపాడగలదు. ప్రాంతాలను బట్టి పండ్ల పోషక విలువలలో వ్యత్యాసం ఉంటుంది. నల్లమలలో ఉండే పండ్ల విలువలపై విశ్లేషణ తరుచూ చేయడం అవసరం. ఈ కలిమి లేక వాక్కాయపై వైద్యపరంగా ఎంత పరిశోధన జరిగినప్పటికీ, వీటిలో అనువైన, అధిక దిగుబడులనిచ్చ వంగడాల తయారీలో క్షేత్రస్థాయి పరిశోధనలు తక్కువని చెప్పవచ్చు.పొలం చుట్టూ కంచెకలిమి తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరిగే గుల్మం లేక చిరు చెట్టు అనవచ్చు. నల్లమల అడవుల్లో కలిమి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వీటి ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి పూత దశ నుంచి మొదలుకొని, పండు దశ వరకు పరిశీలించటం ముఖ్యం. అందులోని వేరియంట్స్ను గమనించి క్షేత్రస్థాయికి తీసుకురాగలిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.ప్రస్తుతానికి రైతులు ఈ చెట్టును పొలం చుట్టూ కంచెగా వాడుతున్నారు. కాయలను (అడవి కలిమికాదు, వాక్కాయను) మార్కెట్ చేసుకోవచ్చు. అక్కడక్కడా వాక్కాయ తోటలు పెంచుతున్నట్లు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, అడవి కలిమిపై సరైన పరిశోధనలు చేపట్టి తినటానికి అనువుగా మార్చటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చెయ్యాలి. కలిమి పండ్లను అతిగా తింటే వాంతులు, విరేచనాలు రావచ్చు. కాబట్టి, ఎందుకైనా మంచిది మితంగా తినాలి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన'
ఎర్ర జాన కూడా ఉష్ణ మండలపు ఆకులురాల్చే చెట్ల తెగకు సంబంధించినది. ఈ చెట్లు 5–8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు, పూలు ఇంచు మించు ఫాల్సా ఆకులను పోలి ఉంటాయి. కొమ్మలు కిందికి సాగి ఉంటాయి.ఈ చెట్లు నలమల అడవి అంతటా లేవు. మల్లాపూర్, అప్పాపూర్ పోయే దారిలో తారసపడుతాయి. ఎర్ర జాన ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ మొదలు చైనా వరకు ఉంటాయి. యున్సోవ్, మలేషియా, మైన్మార్, లాహోస్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా తదితర దేశాలు వీటి స్థలాలు. ఈ చెట్లు దాదాపు సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో కూడ ఆటు పోట్లను తట్టుకొని పెరుగుతాయి.తెలుగు: ఎర్ర జానబెంగాలీ: ధమిన్మరాఠీ: థమన్మలయాళం: చడచి, దనౌనిఇంగ్లీష్: థమన్కన్నడ: బుటలెగుజరాతీ: థమన్తమిళం: వృక్షం, అన్నంహిందీ: థమన్, కహ్ రాచిసంస్కృతం: దన్ వృక్షం అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది.పూత: మార్చి– ఏప్రిల్పండ్లు: మే– జూన్ ఉపయోగాలు...ఈ చెట్ల అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. ఎర్ర జాన పండ్ల పై పొట్టు ఎరుపు– కాషాయ వర్గం కలిగి ఆకరణీయంగా ఉంటాయి.పండ్లలో ఒక గింజ, రెండు గింజలు, కొన్నిటిలో మూడు, నాలుగు గింజలు కూడా ఉంటాయి.గింజలపై ఉండే పలుచటి పొర రుచికరంగా తీపిదనం కలిగి ఉంటుంది. ఈ పండ్లను చెంచులు ఇష్టంగా తింటారు.ఆకులను పశువులు, జీవాలు ఇష్టంగా తింటాయి. కలపను చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు, ఇతర కట్టె వస్తువుల తయారీలో వాడవచ్చు.వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది.బెరడు నుండి కషాయం చేసి, దాన్ని అనేక రుగ్మతలను ముఖ్యముగా పుండ్లు నయం చేయటానికి, వాత, పిత్త, కఫాలను తగ్గించటానికి వైద్యంలో వాడతారు.కడుపులో మంట పోటానికి ఈ బెరడు ఎంతో ఉపయోగపడుతుందని చెంచులు చెప్పారు.ఎర్ర జాన పండ్లలో సూక్ష్మ ధాతువులు, ముఖ్యంగా విటమిన్లతో పాటు యాంతోసైనిన్స్, ఫినాల్స్, ప్లేవనైడ్స్ మొదలగునవి ఉంటాయి.పండ్లలో ఓ మోస్తరు యాంటిఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వ్యవసాయం పంటలు, చెట్లతో కలిపి (ఆగ్రో–ఫారెస్ట్రీ) పెంచదగిన అనువైన చెట్టు.ఎన్నో ఉపయోగాలు కలిగిన ఈ చెట్ల జాతిని అభివృద్ధి ఎంతో అవసరం.ఎర్ర జాన చెట్లపై తగిన పరిశోధనలు జరిపి పల్లపు ప్రాంతాల్లో వీటి ఉనికిని చాటాలి.తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, పోషకలోపాన్ని తగ్గించటంలో ఎంతో ఉపయోగపడగలదని ఆశించవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్యవిశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జ్వరాన్ని తగ్గించడంలో.. ఉల్లింద పండ్ల ప్రత్యేకత
ఉల్లింద జీనస్లో అనేక రకాల జాతులున్నాయి. అడవి పండ్ల జాతుల్లో ఉల్లింద పండ్లకు ప్రత్యేకత ఉంది. వీటికి ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణం. దీనిపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.ఉనికి: ఉల్లింద చెట్టు ఉష్ణమండలంలోని చిట్టడవులు, అడవులు, మైదానం ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు రాల్చే తత్వం గలది. ఈ చెట్టు కొన్ని సందర్భాల్లో గొడుగు ఆకారం 6–10 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఇంచుమించు అన్నిరకాల నేలల్లో (చౌడు భూములు తప్ప) పెరుగుతుంది. విత్తనం ద్వారానే దీని ప్రవర్ధనం జరుగుతుంది. దీని పండు మొదలు ఆకుపచ్చగా ఉండి, పండినప్పుడు ఆరంజ్–ఎరుపుగా మారుతుంది.దీని స్వస్థలం మధ్య–దక్షిణ ఇండియా, బంగ్లాదేశ్ ఇతర ఉష్ణమండల దేశాలై ఉండవచ్చు. ఇండియాలో మాత్రం దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ (నల్లమల అడవులు), కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఒడిషా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. నల్లమల అడవుల్లో ఈ చెట్లు అధికంగానే ఉన్నాయి. అడవి విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. మొత్తానికి దీనిపై పరిశోధన చెప్పుకున్నంత జరగలేదు.ఉల్లింద ఉపయోగాలు:ఆకులు వగరుగా ఉన్నా మేకలు ఇష్టంగా తింటాయి. ఇది సతత హరితం. కాబట్టి వేసవిలో కూడా ఆకుల లభ్యత ఉంటుంది.పండ్లు వగరు–తీపిని కలబోసినట్లుగా ఉంటాయి. పండ్లు చిన్నవిగా, గుండ్రంగా ఉండి నిగనిగలాడుతుంటాయి. ఈ పండ్లను చక్కెర భీమారి ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు.వంట చెరకుగా ఉపయోగపడుతుంది.వీటి ఆకుల రసం రెండు పూటలా తాగిస్తే విరేచనాలు తగ్గుతాయి.ఈ పండ్లు తింటే అజీర్తి నివారింపబడుతుంది.ఎండిన పూల పొడిని నీటిలో కలిపి తాగించడం వల్ల మూత్రకోశ వ్యాధులు నివారించబడతాయి.ఉల్లిందను సిద్ధ ఔషధంలో విరివిగా వాడతారు.జ్వరాన్ని తగ్గించడంలో ఈ చెట్టుకు మంచి పేరుంది. చెట్టు బెరుడు/మాను పెచ్చులను నానబెట్టి మొక్కలపై చల్లినట్లైతే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చు.నల్లమల అడవులు..నలమల అడవులు ఆవరించిన అన్ని జిల్లాల్లో ఈ చెట్లు ఉన్నాయి. పశువుల కాపరులకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇది ఎప్పుడూ ఆకులతో పచ్చగా ఉండడం వల్ల ఎండాకాలంలో నీడతో ΄ాటు పండ్లు కూడా లభిస్తాయి. సేద తీర్చుకోవటానికి నీడనిచ్చే మంచి చెట్టు.ఈ చెట్లపై లోతైన పరిశోధనలు జరగలేదు. దేశంలో కొన్నిప్రాంతాలకే పరిమితం కావడం ఒక కారణం అయితే ఎక్కువగా అడవుల్లోనే ఇవి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఈ పండ్లకు ఔషధ, పోషక విలువలు ఉన్నందు వల్ల లోతైన పరిశోధనల అవసరం ఎంతైనా ఉంది. అట్లే వీటిని ఆగ్రోఫారెస్ట్రీలో భాగం చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉల్లింద పండ్ల చెట్లు ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల్లో కూడా ఉన్నాయి. ఈ పండ్లలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున తినే ఆహారం అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.ఉల్లింద చెట్టు పేర్లు: ఇంగ్లీష్: గ్రీన్ ఎబోని పర్సిమోన్ ఒరియా: బండోడి, గౌర్కస, కొసై కన్నడ: జగలగంటి, నిన్నె, నేన్సి, కరగరి యంతుమర తమిళం: కరువక్కనై, పెరియులిన్సి, వక్కనై తెలుగు: ఇల్లింటు, కవకీమాను, ఉల్లింద, కోషవో, నేల ఇల్మీర, ఇల్లింద, తొరిక, వల్లంజ, పుల్లిండే, పెద్ద ఉల్లింద, పెద్దఉలిని, కాయకిమాను మరాఠీ: నేన్సి, నినై హిందీ: కలటెండు, కిన్నూ. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
ఈత చెట్టు రూపురేఖలు ఖర్జూరపు చెట్టుకు అతి దగ్గరగా ఉంటాయి. పుష్పించే విధానం, పండ్ల గుత్తులూ ఒకేలాగ ఉంటాయి. ఈ చెట్టు తెలియని వారుండరు. తరతరాల నుండి గుర్తున్న చెట్లల్లో ఈత చెట్టు ఒకటి. పల్లెవాసులకే కాకుండా పట్టణవాసులకూ సుపరిచితమైన చెట్టు ఈత. దీని ఔషధ విలువల వల్ల ఈ చెట్టుకు చాలా ప్రాచుర్యమున్నది. దీన్ని ‘సిల్వర్ డేట్ పాం’ అని కూడా పిలుస్తుంటారు.ఉనికి..ఈ చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పూత–కాత మాత్రం కొంత అటు–ఇటు అయినా (పరిస్థితులను బట్టి) ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. అట్లని ఇతర నేలల్లో రాదని కాదు. ఈత పల్లపుప్రాంతాల్లో కూడ వస్తుంది. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న దగ్గర పెరుగుతుంది. వీటి స్వస్థలం దక్షిణ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, చగోస్ ఆర్చిపిలాగై, పుర్టోరికో, ‘లీవర్డ్ ఐలాండ్’లు.ఈత చెట్టు సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తువరకు ఉండే ప్రాంతాలలో కూడా రాగలదు. దీని కాయలు ఆకు పచ్చరంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పసుపు రంగుకు, పండుగా మారినప్పుడు కాషాయ రంగుకు మారతాయి. ఈత చెట్లు దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు. కానీ కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి. ఈత చెట్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.ఉపయోగాలుఈత ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఉపాధి కూడా (చాపలు, ఈత పొరకలు, చిన్న చిన్న ఆట వస్తువులు)గుడిసెల పైకప్పుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు.మొగిలోన పిండి పదార్థం రుచిగా ఉంటుందని గ్రామస్తులు దాన్ని సేకరించి వాడుతారు. మొగి తీయడం వల్ల చెట్టు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ మొద్దును రెండుగా చీల్చి మధ్యన ఉన్న భాగాన్ని తీసి అనేక విధాలుగా వాడుతారు. (ఉ: చిన్న చిన్న కాలువలు దాటటానికి అడ్డంగావేస్తారు. దానిపై కాలినడక సాగిస్తారు. పందిళ్లకు పోల్స్గా వాడుతారు.ప్రధానంగా ఈత చెట్టు నుండి ‘నీరా, కల్లు’ తీస్తారు. ఉదయం సూర్యోదయం కాకముందు చెట్టు నుండి తీసేది ‘నీరా’. ఆ తర్వాత నీరా పులిసి కల్లుగా మారుతుంది. నీరాకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది.నీరాను సేవించడం వల్ల కిడ్నీలోని రాళ్ళు కరిగి పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.నీర నుండి ‘ఈత బెల్లాన్ని’ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు.ఈత పండ్లు రుచిగా ఉంటాయి.ఈత పండ్ల నుండి జామ్, జల్లి వంటి విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేస్తారు.ఈ పండ్లు తినడం వల్ల బ్యాక్ పెయిన్, పిరుదులపై కండరాలు పట్టినట్లు ఉంటే తగ్గుతాయి. (ఇవి టానిక్ లా పనిచేస్తాయి).పండ్లు కూడా ఎన్నో పోషక విలువలు కలవి.చెట్లను ల్యాండ్ స్కేపింగ్లో అందం కోసం నాటుతారు.వేర్లను పండ్ల నొప్పులను, నర్వస్ డెబిలిటీ, హెల్మింథియాసిస్ జబ్బులను నయం చేయటానికి ఉపయోగిస్తారు.నీరాను ఎండకాలంలో తాగితే చలువ చేకూర్చుతుంది. ఇందులో కూడా అనేక పోషక విలువలున్నవి.ఔషధంగా ఈతకు ప్రత్యేకత ఉంది. ఉదర సంబంధిత జబ్బులు, జ్వరాలు, మూర్ఛ, అజీర్తి, హృదయ సంబంధిత జబ్బులను నయం చేయటంలో ఈత నీరా గాని, బెల్లంగాని, మొగి గాని వాడుతారు.నీరాలోని ఇనుము వంటి సూక్ష్మపోషకాలు, బి12 వంటి విటమిన్లు రోగులకు చాలా మంచిది. రెగ్యులర్ గా సేవిస్తే వారిలో రక్తశుద్ధి జరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల పటుత్వానికి దోహద పడుతుంది.ఈతకు పెద్ద ఈత, ఈత అని రెండు పేర్లున్నాయి. ఇంగ్లిష్: వైల్డ్ డేట్ పాం, డేట్ సుగర్ పాం, ఇండియన్ వైల్జ్ డేట్, ఇండియన్ వైన్ పామ్ అస్సామీ: ఖాజురి;ఉర్దూ: ఖాజర్;ఒరియా: ఖర్జుర్;గుజరాతీ: ఖజ్జార్, ఖజా; కన్నడ: ఇచలు;తమిళంలో: ఇచం, పేరియా, ఇలచం;బెంగాలీ: ఖర్జూర, ఖఝూర్; పంజాబీ: ఖజుర్;మణిపురి: తంగటప్; మరాఠీ: సెండి, బైచంగ్, ఖర్జూర్, షిండ్రీ, షింధీ;మలయాళం: కట్టింతా, కట్టింతై, నీలన్ తెంట్ హిందీ: ఖజూర్;సంస్కృతం: ఖర్జూరహా, ఖర్జూర్ నేపాలీ: ఖండేలా, ధడ అంటారు.నల్లమల అడవులు:నలమలప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. ఇవి అంది నేలల్లో (చౌడు నేలల్లో) కూడా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. అడవిలోని సెలయేర్లు/వంకలు/ డొంకల దగ్గర ఉన్న వాటిలో పోషక విలువల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి వీటిపై పరిశోధన చేపట్టి కొత్త వంగడాల అన్వేషణ మొదలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చెట్టు కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత ఉత్పత్తులపై శోధించగలితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈత వనాలతో ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే కొందరు ఈత వనాలు పెంచి కేవలం నీరా–కల్లు కోసమే ఉపయోగిస్తున్నారు. ఈత చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!
ఉనికి.. ఇరికి పండ్ల చెట్లు 3–4 మీటర్ల ఎత్తు వరకు పెరిగి గొడుగు ఆకారంలో విస్తరించగలవు. బరువైన నేలలో వీటి సగటు ఎత్తుకంటే ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ చెట్లు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కూడా పెరగ గలవు. ఉప హిమాలయప్రాంతం నుండి కన్యాకుమారి వరకు ఈ చెట్లు విస్తరించాయి.పొడి – తడి ఆకులు రాల్చే అడవులలోనూ వీటి ఉనికి అధికంగా ఉంటుంది. ఈ చెట్టు స్వస్థలం చైనా, జపాన్, తైవాన్, ఇండియా అయినప్పటికీ.. పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడ విరివిరిగా ఉన్నట్లు ఆనవాలు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో బంక చెట్లకు మంచి గుర్తింపు ఉన్నది. పడమటి – తూర్పు కనుమలలో వీటి ఉనికి అధికమని చెప్పవచ్చు.కాబట్టి వీటిపై పరిశోధనలతో పాటు పల్లె ప్రజలకు ఈ చెట్ల ఉపయోగాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కల్పించే విధంగా ప్రయోగ ఫలితాలు ఉంటే, గ్రామవాసులకే కాకుండా పట్టణ వాసులకు ఎంతో లబ్ది చేకూరుతుంది. ఉపయోగాలువీటి కలప గట్టిగా ఉన్నా వర్షానికి నానితే త్వరగా చెడిపోతుంది. దీన్ని ఫర్నీచర్, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు తయారీలో వాడతారు.ఈ పండ్లు లేత గులాబీ రంగు కలిగి ఆకర్షణీయంగా ఉండి గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాస్తాయి. గుజ్జు మాత్రం బంకతో కూడుకొని ఉండటం చేత దీనికి బంక పండు అని పేరొచ్చింది. పండ్లు ఓ మోస్తురు తీపి వగరుతో ఉంటాయి.వీటి ఆకులను మేకలు ఇష్టంగా తింటాయి. పచ్చి కాయలను ఊరగాయగా, కూరగాయగా గ్రామాలలో కొందరు వాడతారు.ఈ పండ్లలోని గుజ్జును పేపర్లు మొదలగు వాటిని అతికించటానికి ఉపయోగించేడివారని అమరాబాదు గ్రామస్తులు తెలిపారు.ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెపుతున్నది. ఈ చెట్టు బెరుడు, వేర్లు, చిగుర్లు, ఆకులు మొదలగునవి అనేక రకాల రోగాలను నయం చేయటానికి నాటు వైద్యులు వాడేవారట. ముఖ్యంగా బెరుడుతో చేసిన కషాయాన్ని విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, తల నొప్పి మొదలగు రుగ్మతల నుండి ఉపశమనం పొందటానికి మూలికా వైద్యులు ఇప్పటికీ వాడతారని చెంచులు చెప్పారు. బెరడు కషాయాన్ని నోటి అల్సర్లు ఉన్నపుడు నోటిలో పోసుకుని మూడు పూటలా పుక్కిలించాలి. మూడు రోజుల్లో తగ్గుతుంది.పండ్ల గుజ్జును దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తారు.అట్లే పండ్లను పెరుగులో నాన బెట్టి రోజుకు రెండు సార్లు ఒళ్ళంతా పట్టిస్తే ఎండ పొడ నుంచి విముక్తి పొందవచ్చు. ఇరికి పండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని పరిశీలనలో రుజువైంది.నల్లమల అడవులు, ఇతర అడవులతో పాటు మైదానపుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. రాను రాను ఈ చెట్లు నిరాదరణకు గురి కావడం చేత చాలా వరకు కొట్టి వేతకు గురవుతున్నాయి. బంక పండ్లపై ప్రత్యేకించి న్యూట్రీటివ్ విలువలపైన, ఔషధాల పరంగా ఎన్నో దేశాల్లో పరిశోధనలు చేశారు. ప్రయోగాల ఫలితాలు రైతుల చెంతకు చెరలేదనవచ్చు. కాబట్టి ఈ పండ్ల దిగుబడి, విలువ ఆధారిత ప్రయోజనాలపై తగినన్ని పరిశోధనలు చేయగలిగితే, ఈ పండ్ల చెట్లు రైతుల చెంతకే కాకుండా మిద్దె తోటలతో పాటు పెరటి పండ్లుగా మారే అవకాశం ఎంతగానో ఉంది. ఇందుకు ఉద్యాన శాఖ, ఫారెస్ట్ (పరిశోధన, అభివృద్ధి), ఇతర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది.వివిధ భాషల్లో ఇరికి / బంక పండు పేర్లు- అస్సామీ: గోబోహాట్, బహుబర - ఇంగ్లీష్: ఇండియన్ చెర్రి, క్లమ్మి చెర్రి, ఫ్రాగ్రాంట్ మంజక్, స్పోట్టిగోబ్బల్స్, కుమ్మింగ్ కార్డియా, గ్లుచెర్రి, అనోనంగ్, పింక్ పర్, బర్ లైంట్రీ. - ఉర్దూ: లసుర, లస్సోర : ఒరియా: భురపత, లసోర. - కన్నడ: కెంజుల, చలైహన్ను, హడిగే, దొడ్డచల్లు, మన్నడికె కెండిల్, గోండెమర, కడుచలె. - గుజరాత్: వడ్ గుండ : తమిళం: నరువిలి, సిటం, నరువలి. - తెలుగు: బోటీగిరి, ఇరికి పండు, బంక పండ్లు, బంకనక్కెర.- మరాఠీ: బోకర్, సేలు. - హిందీ: లసోడ, లసోర, లంగ్రీ, గుండ- సంస్కృతం: బహు వరహా- పంజాబి: లసురే. - బెంగాలి: భోకరీ, బహుబర, బోచో. - నేపాలి: బొహొరి, కాలో బొహరి అని పిలుస్తుంటారు.ప్రాంతాలను బట్టి ఈ పండు పేరు ఉచ్ఛారణలో కొంత తేడా ఉండవచ్చు. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్, మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పచ్చడి తిని 14 మంది మృతి
మేఘాలయాలోని మారుమూల గ్రామం సైఫుంగ్లో జరిగిన ఘోర విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడవి పళ్లతో చేసిన పచ్చడి తిని 14 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వీరంతా ఓ రోడ్డు నిర్మాణంలో పనిచేసేందుకు ఒడిషా నుంచి మేఘాలయాకు వలస వచ్చారు. సోమవారం ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఆదివారం రాత్రి భోజనంలో విషపు పండ్లతో చేసిన పచ్చడి తినడం వల్లే మరణాలు సంభవిచినట్లు భావిస్తున్నామని, అవగాహన లేకే ఇలా జరిగి ఉంటుందని, పోస్ట్మార్టం రిపోర్టుకూడా దీనిని బలపరిచే అవకాశం ఉందని ఐజీ జీపీ రాజు మీడియాకు తెలిపారు.


