breaking news
Warangal by -election
-
'తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు'
వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయూ పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులలో టీఆర్ఎస్ మంత్రుల్లా .. ప్రతిపక్షాలు ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా.. అని ప్రశ్నించారు. తమపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఉద్యమంలో ప్రజలతో కలిసి రోడ్లపైనే గడిపామని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు ప్రజలు అసహ్యించు కున్నారని ఎద్దేవా చేశారు. -
వరంగల్లో ఎమ్మెల్యే రోజా రోడ్ షో
వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ప్రచారం కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా గురువారం నగరంలోని రైల్వే గేట్ వద్ద రోడ్ షో నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధనకు ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ కు ఓటు వేయాలని కోరారు.