-
గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం
బంజారాహిల్స్: వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏబీ కుప్పురాంకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. జూలై 26న సౌతాఫ్రికాలోని పీటర్మార్టిజ్బర్గ్ నగరంలో ప్రారంభమైన ‘గాంధీ–మండేలా యూత్ సింపోజియం’లో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు పీటర్మార్టిజ్బర్గ్ గాంధీ మెమోరియల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్ బన్నీబూలా ఆహ్వానం పంపగా.. జూలై 23న ఆయన సౌతాఫ్రికాకు వెళ్లారు. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సత్సంబంధాలు నెలక్పొలే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే అవకాశం లభించడంపై కుప్పురాం ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక ప్రతిష్టాత్మక సదస్సు అని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఆయన గాంధీ మనవరాలు ఇలాగాంధీని కలుసుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికాలో పొలిటిషియన్, యాక్టివిస్ట్. -
వెంగళరావు పార్కుకు మహర్దశ !
బంజారాహిల్స్: జలగం వెంగళరావు పార్కుకు మహర్దశ పట్టనుంది. పార్కులో దుర్గంధంతో నిండిపోయిన చెరువును బాగు చేయాలని, ఇందు కోసం వారం రోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించి తనకు అందించాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జలగం వెంగళరావు పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన అధికారులతో కలిసి పార్కును సందర్శించారు. ఇక్కడి చెరువు దుస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలుస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ సీవరేజీ పైప్లైన్ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో మురుగు నీరు కలవకుండా పైప్లైన్ నిర్మాణ పనుల కోసం ఇప్పటి వరకు రూ. 28 లక్షలు ఖర్చు చేశారనిన జీహెచ్ఎంసీ ఇంకో రూ. 45 లక్షలు వాటర్ వర్క్స్కు అందిస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయని వాకర్లు తెలపగా అక్కడే ఉన్న జోనల్ కమిషనర్ రవికిరణ్కు తక్షణం ఈ నిధులు వాటర్ వర్క్స్కు అందజేయాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ సమన్వయంతో పని చేసి వచ్చే సోమవారం నాటికి ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేసి తన వద్దకు రావాలని చెప్పారు. ఐ లాండ్ నిర్మాణంతో పాటు వాటర్ ఫాల్స్ నిర్మాణం కూడా చేపట్టాలని వాకర్లు మంత్రిని కోరారు. మంత్రి వెంటసెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ సోమరాజు, వాటర్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ రామేశ్వర్రావు, ఆర్అండ్బి చీఫ్ ఇంజనీర్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణతో పాటు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement