-
తండ్రులారా.. ఆ అలవాటు మానేయండీ!
లండన్: కాలుష్యపూరిత వాతావరణంలో పెరిగే పిల్లలు ఆస్తమాబారిన పడతారనే విషయం తెలుసు. కానీ పిల్లల్లో ఆస్తమాకు కారణం తండ్రులేనని తాజాగా చేసిన ఓ పరిశోధనలో తేలింది. యుక్తవయసు నుంచే పొగతాగే అలవాటున్నా, పొగతాగడం మితిమీరినా.. వారికి జన్మించే పిల్లలు లేదా ఆ కుటుంబంలోని పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో రుజువైంది. అన్నిదేశాల్లోనూ ఇలా జరిగే అవకాశాలు అధికమని తేల్చేశారు. నార్వేలోని బెర్జెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 24,000 మంది పిల్లలపై పరిశోధన చేయగా.. వారిలో ఆస్తమా బారిన పడిన పిల్లల తండ్రులకు పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. సాధారణ కారణాలతో ఆస్తమాబారిన పడిన పిల్లలతో పోలిస్తే స్మోకింగ్ చేసే తండ్రులున్న కుటుంబంలోని పిల్లలు మూడింతలు ఎక్కువగా ఆస్తమాబారిన పడుతున్నారని బెర్జెన్ యూనివర్సిటీ పరిశోధకుడు సిసిలీ స్వాన్ తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తండ్రులు పొగతాగడం మానేసినా దాని ప్రభావం మాత్రం పిల్లలపై ఆ తర్వాత కూడా కొనసాగినట్లు గుర్తించారు. -
బాసులే ఎక్కువగా ఇరగదీస్తున్నారట!
లండన్: ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా ఓ వ్యసనంలా అందర్ని చుట్టేసిందంటే ఆశ్చర్య పడాల్సిన విషయమేమి కాదు. ఇల్లైనా, ఆఫీసైనా, కనీసం మొబైల్ తోకాని సోషల్ మీడియాతో కనెక్ట్ అయి చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేసుకోవడం అన్నివర్గాల వయస్సుల వారికి ఓ అలవాటుగా మారింది. అయితే పనివేళల్లో సాధారణ ఉద్యోగుల కంటే బాసులే ఎక్కువగా ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్ జెన్ ఓ సర్వేను నిర్వహించింది. ఆఫీసుల్లో పని వదిలేసి.. వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను టాప్ మేనేజర్లు విరివిగా వినియోగిస్తున్నారని సర్వేలో స్పష్టమైంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు సోషల్ మీడియా మోజులో పడటం వలన ఉత్పత్తి తగ్గడమే కాకుండా, ఆర్ధికంగా కంపెనీలు నష్లాలకు లోనవుతున్నట్టు సర్వేలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సర్వేలలో సుమారు 11 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సీనియర్ ఉద్యోగుల కంటే యువ ఉద్యోగులే సోషల్ మీడియాను ఉపమోగించుకుంటున్నారని పరిశోధనలో తెలిసింది. ఆఫీస్ సమయంలో మహిళా ఉద్యోగుల కంటే పురుషులే వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట. కార్యాలయాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే ఉద్యోగం పోతుందనే భయం కూడా ఉద్యోగుల్లో కనిపించడం లేదని తాజా సర్వే వెల్లడించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement