-
యూట్యూబ్ చూసి.. బైక్లు చోరీ చేసి
చిత్తూరు అర్బన్/దేవరపల్లి (పశ్చిమ గోదావరి): యూట్యూబ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారీగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 13 మంది అంతర్ రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 107 బైక్లు, ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకోగా.. అదే తరహాలో చోరీలకు పాల్పడిన మరో ఇద్దరి అరెస్ట్ చేసి 109 బైక్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఒకేరోజు 216 బైక్లు పట్టుబడటం గమనార్హం. రెండుచోట్లా పట్టుబడిన నిందితులు అంతర్ రాష్ట్ర దొంగలు కావటం.. టెక్నాలజీ సాయంతోనే చోరీలకు పాల్పడటం విశేషం. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన చోరీలకు సంబంధించి ఎస్పీ సెంథిల్కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, శ్రీసిటీ సబ్–డివిజన్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్టు పోలీసులకు పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన డీఎస్పీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృందాలు చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు జిల్లాకు చెందిన నాలుగు ముఠాలు వాహనాల చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. జల్సాలకు అలవాటు పడి ఆ దొంగల్లో పలువురు యూట్యూబ్లో చూసి చోరీలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లా కేసుల్లో నిందితులు వీరే.. చిత్తూరు సబ్ డివిజన్లో యాదమరికి చెందిన ఎ.వినోద్కుమార్ (25), సీజీ రాజా (47), చిత్తూరు నగరంలోని ప్రశాంత్నగర్కు చెందిన ఎస్.రవిచంద్ర (32) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన ఎస్.సతీష్కుమార్ (27), ఐ.జయచంద్ర (55), వరదయ్యపాలెంకు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు (27), ఎస్.సుబ్రహ్మణ్యం (18)లను అరెస్ట్ చేసి 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని పేర్నంబట్టుకు చెందిన జి.మురళి (25), పి.కుమరేశన్ (34), యాదమరికి చెందిన జ్యోతి (50) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీ పరిధిలో సత్యవేడుకు చెందిన ఎస్.యుగంధర్ (26)ను అరెస్ట్ చేసి 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వాహనాలకు మార్కెట్లో లభించే నాణ్యత ఉన్న లాక్లను ఉపయోగించాలని, బైకులు చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సెంథిల్కుమార్ కోరారు. కాగా, డీఎస్పీలు సుధాకర్రెడ్డి, గంగయ్య, యశ్వంత్లతో పాటు దర్యాప్తులో పాల్గొన్న సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దేవరపల్లిలో 109 బైక్లు తెలంగాణతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటార్ బైక్లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.55 లక్షల విలువైన 109 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రాహుల్దేవ్శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పత్సా రాంబాబు, మారం మునియ్య కలిసి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరు కూడా తాళాలు వేసి ఉన్న ఎలాంటి బైక్నైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సులభంగా స్టార్ట్ చేసి దర్జాగా వేసుకెళ్లిపోయేవారు. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును జల్సాగా ఖర్చు చేసేవారు. వీరిద్దరూ దొంగిలించిన 109 బైక్లలో 83 బైక్లకు సంబంధించి ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, దేవరపల్లి, కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, తాడేపల్లిగూడెం, ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, తెలంగాణలోని ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు ఎస్పీ తెలిపారు. 26 బైక్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. చోరీ చేసిన మోటార్ సైకిళ్లను యాదవోలుకు చెందిన 12 మంది వ్యక్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దేవరపల్లి ప్రాంతంలో సారా తయారీదారులు ఈ బైక్లను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు 93 బైక్లను యాదవోలు గ్రామంలోనే విక్రయించినట్టు చెప్పారు. తనిఖీల్లో పట్టుబడ్డారు నిందితులు పత్సా రాంబాబు, మారం మునియ్య పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు, సిబ్బంది వచ్చీపోయే వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులిద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి అసలు విషయాన్ని రాబట్టారు. నిందితులిద్దరితోపాటు బైక్లు కొనుగోలు చేసిన 12 మందిపైనా కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చోరీ అయిన బైక్లను త్వరితగతిన స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీధర్, దేవరపల్లి ఎస్సై కె.శ్రీధర్, స్టేషన్ సిబ్బందికి ఎస్సీ రాహుల్దేవ్శర్మ రివార్డులు అందజేశారు. -
సూర్య బైక్.
డోన్ ఐటీఐ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ - సూర్యకాంతితో నడిచే వాహనం - తీరనున్న ఇంధన కష్టాలు - ఫుల్ చార్జింగ్తో 60 కిలోమీటర్ల ప్రయాణం - అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇ-బైక్ డోన్ రూరల్: లీటరు పెట్రోల్ ధర రూ.80. మారుతున్న కాలానికి అనుగుణంగా దైనందిన జీవితంలో ద్విచక్ర వాహనం కూడా భాగమైపోతోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరతో వీటి నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో డోన్ ఐటీఐ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ అందరినీ అబ్బురపరుస్తోంది. వీరి కృషి ఫలించి.. సోలార్ బైక్లు మార్కెట్లోకి వస్తే ఇంధన కష్టాలకు చెక్ పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలులోని ఇండస్ పాఠశాలకు చెందిన సూర్యతేజ చిన్నప్పటి నుంచి సాంకేతిక పరిజ్ఞానంపై ఎనలేని మక్కువ. ఆ దిశగా తరచూ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఇండస్ పాఠశాలను సందర్శించిన సమయంలో సూర్యతేజ తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్నోవేటర్ బంగారురాజు ఆయనకు సహకరించారు. తన ఆవిష్కరణకు కొన్ని పరికరాలు అవసరం కావడంతో డోన్ ఐటీఐ కళాశాలను ఎంచుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామయ్య, అధ్యాపక సిబ్బందితో మాట్లాడి సోలార్ ఇ-బైక్ తయారీకి సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్ ట్రేడ్ విద్యార్థుల సమష్టి కృషితో టీవీఎస్-50 ఎక్సెల్, సైకిల్, బైక్ సామగ్రిని కొనుగోలు చేసి సూర్యతేజ సోలార్ బైక్ను రూపొందించారు. ఇందుకోసం ఈ విద్యార్థులు చేసిన ఖర్చు రూ.30 వేలు మాత్రమే. బైక్కు అమర్చిన బ్యాటరీ ఫుల్ చార్జి అయితే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. బ్రేక్ వేసినప్పుడు మోటార్ జనరేటర్గా మారి విద్యుదుత్పత్తి చేసి మరింత దూరం ప్రయాణించేందుకు దోహదపడుతుందని వివరించారు. -
మ్యాన్హోల్లోకి బైక్ యువకుడికి తప్పిన ముప్పు
మెహిదీపట్నం, న్యూస్లైన్: అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణంపైకి తెచ్చింది. మరమ్మతుల కోసం తెరిచి ఉంచిన మ్యాన్హోల్లోకి ద్విచక్ర వాహనం నిలువునా దిగబడిపోయింది. దానిపై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్ర గాయాలపాలు కాగా, వెనుక కూర్చున్న బాలుడు పక్కకు దూకి బయటపడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మురాద్నగర్కు చెందిన మహ్మద్ అసదుద్దీన్ కుమారుడు వసీముద్దీన్ (17) గుడిమల్కాపూర్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో జయభూషణ్ ఆస్పత్రి నుంచి వివేకానంద కాలనీ లోపలికి వస్తున్నాడు. రోడ్డు మధ్యలో పెద్ద మ్యాన్హోల్కు సగం మరమ్మతులు చేసి వదిలేశారు. మరమ్మతులో ఉందన్న కనీస సూచికను కూడా జలమండలి అధికారులు ఏర్పాటు చేయలేదు. దీనికితోడు అక్కడున్న వీధి దీపం కూడా వెలగకపోవడంతో వసీముద్దీన్ తన ద్విచక్రవాహనంతో వెళ్తూ మ్యాన్హోల్ కనిపించకపోవడంతో అందులో పడి పోయాడు. ద్విచక్రవాహనం పూర్తిగా తలకిందులుగా అందులో పడిపోయింది. అదృష్టవశాత్తు అతను గాయాలతో బయటపడ్డాడు. అతని వెనుక ఉన్న బాలుడు పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది యాదయ్య, శ్రీకాంత్లు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలకు గురైన వసీముద్దీన్ను నానల్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మూడు రోజులుగా పడుతూనే ఉన్నారు టఈ మ్యాన్హోల్ కొద్ది రోజులుగా శిథిలావస్థలో ఉంది. దీనికి మరమ్మతులు చేయాల్సిందిగా స్థానికులు జలమండలి అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేయడంతో..వారు తీరిగ్గా నాలుగురోజుల క్రితం స్పందించారు. అప్పటి నుంచీ మ్యాన్హోల్కు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం కూడా ఈ మ్యాన్హోల్లో ఇద్దరు యువకులు పడి స్వల్ప గాయాలతో బయటపడినట్లు పక్కనే ఉన్న దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న ఈ మ్యాన్హోల్కు మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement