breaking news
Two Suiside
-
ఇద్దరి ఆత్మహత్య
అనారోగ్యం భరించలేక యువతి... కారేపల్లి : అనారోగ్య సమస్యలను భరించలేని ఓ యువతి తీవ్ర మనోవేదనతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని బాజుమల్లాయిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన కత్తికోల శ్రీవాణి (21) గత ఏడాది డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. పదేళ్ల క్రితమే తల్లి మృతిచెందింది. తండ్రి వెంకటేశ్వర్లు, అన్నలు నాగేంద్రబాబు, రాకేష్తో కలిసి ఉంటోంది. ఐదేళ్ల క్రితం శ్రీవాణికి వెన్నునొప్పి శస్త్ర చికిత్స జరిగింది. అయినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే అంగవైకల్యం ఏర్పడింది. శరీర ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆమె, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొన్ని గంటల తరువాత తండ్రి వెంకటేశ్వర్లు వచ్చేసరికి నిశ్చల స్థితిలో కనిపించింది. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె సోదరుడు నాగేంద్రబాబు ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ శశిధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువకుడు.. టేకులపల్లి : మద్యానికి బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భూక్య కృష్ణ నాయక్ తెలిపిన వివరాలు... స్థానిక బి–కాలనీ తండాకు చెందిన బానోతు వెంకన్న(24)కు, దేవితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వెంకన్న, కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. ఆమె విసుగెత్తింది. సోమవారం గట్టిగా మందలించింది. ఇలాగే రోజూ తాగొస్తే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళతానని బెదిరించింది. దీంతో అతడు మంగళవారం మద్యంమత్తులో పురుగుమందు తాగాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీవు లేని లోకంలో ఉండలేను..
⇒ మొన్న ప్రియుడు.. నేడు యువతి ⇒ మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు బలవన్మరణం కోల్సిటీ: ‘నీవు లేని లోకంలో నేను బతక లేను..’అంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మూడు రోజుల క్రితం తన కళ్లెదు టే ప్రియుడు ఉరేసుకోవడంతో అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆమె శుక్రవారం తానూ ఉరి వేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వ్యాపారి బోడకుంట చొక్కయ్య– రాజే శ్వరిల చిన్న కూతురు ప్రియాంక(24) ఎమ్మెస్సీ చదివింది. గోదావరిఖనికే చెందిన సింగరేణి ఉద్యోగి మార్క మొగిలి కుమారుడు ప్రవీణ్ కుమార్గౌడ్(27) ప్రియాంకలు ప్రేమించుకున్నారు. మైనింగి డిప్లొమా చేసిన ప్రవీణ్ శ్రీశైలం సమీపంలోని ప్రైవేటు కంపెనీలో, ప్రియాంక హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవల ఇద్దరు వేర్వేరు పనులపై గోదావరిఖనికి వచ్చారు. ఈ నెల 15న ప్రవీణ్ తల్లిదండ్రులు ఓ వివాహ వేడుకలకు వెళ్లడంతో ప్రియాంకను ఇంటికి రప్పించాడు. పెళ్లి చేసుకునే విషయంపై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏడాది తర్వాత చేసుకుందామని ప్రియురాలు చెప్పింది. ఆవేశంతో చనిపోతానంటూ బెదిరిస్తూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ప్రవీణ్ ఉరేసుకున్నాడు. కళ్లెదుటే ప్రవీణ్ చనిపోవడంతో మనస్తాపం చెందిన ప్రియాంక మూడు రోజులుగా మౌనంగా ఉంటోంది. దీంతో ఆమెను తల్లిదండ్రులు స్థానిక కాకతీయనగర్లోని ఆమె బాబాయ్ ఇం టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఇంటికి తీసుకు వచ్చారు. కాగా, టీవీ చూస్తున్న ప్రియాంక అకస్మాత్తుగా బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బెడ్రూం తలుపులు పగలగొట్టి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది.