breaking news
Trimurthulu Movie
-
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
వడ్డే నవీన్.. 90వ దశకంలో ఆయన స్టార్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరేట్ హీరో ఇతనే. 2000వ సంవత్సరం వరకు వరుస సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత యంగ్ హీరోలు రావడంతో ఈ ఫ్యామిలీ హీరో వెనక్కి తగ్గాడు. చివరగా ఆర్జీవీ ఎటాక్ (2016) సినిమాలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ఈవెంట్కి స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటూ..ఆయన ఎంత పవర్ఫుల్లో వివరించాడు.నవీన్ హీరోగా చేసిన ఒక సినిమాకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడట. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్ని ఆయ్యానని..ఆది సినిమాకు నాంది నవీనే అంటున్నాడు. ‘నవీన్తో కలిసి ఒకే ఒక్క సినిమాకు అసిస్టెంట్గా పని చేశా కానీ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చేసిన సినిమాల్లో 90శాతం కంటే ఎక్కువగా ఇష్టం లేకుండానే చేసేశాడు. ఓ సారి నేను ఓ సీన్ రాశా..అది చూసి ఇది ఎవరు రాశారని అడిగారు. నేను డైరెక్షన్ టీమ్ అని చెప్తా.. కానీ నేనే రాశానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి భోజనానికి పిలిచాడు. అప్పుడే ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ఆపేసి..డైరెక్షన్ చేయమని చెప్పాడు. నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆయన సినిమాకు అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ను స్విట్జర్లాండ్లో కలిశా. అలా ఆది సినిమాకు నవీన్ సినిమా నాందిగా నిలిచింది’ అని వినాయక్ చెప్పాడు.ఇక నవీన్ ఎంతపవర్ఫుల్లో వివరిస్తూ.. ‘ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విమానంలో స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు వస్తుంటే ఒక కాస్ట్యూమర్ సిగరేట్ కాల్చారు. అది భద్రతా సిబ్బందికి తెలిసి..చెన్నైలో అడుగుపెట్టగానే ఏకే 47 గన్లతో వచ్చి ఆ కాస్ట్యూమర్ను అరెస్ట్ చేశారు. ఈ విషయం నవీన్ దగ్గరకు వెళ్లగానే.. ఒక ఫోన్ కాల్ చేసి నిమిషాల్లో విడిపించాడు. అప్పుడు ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత పవర్ ఫుల్లా అని ఆశ్చర్యపోయాను’ అని వినాయక్ అన్నాడు. -
అందుకే బ్రేక్ వచ్చింది : వడ్డే నవీన్
వడ్డే నవీన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (నిర్మాత వడ్డే రమేష్) చనిపోయిన తర్వాత నేను నటించిన, నిర్మించిన తొలి చిత్రం ఇది. పదేళ్లుగా నేను సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను. ఫ్యామిలీతో ఉంటున్నాను. నాకు బ్రేక్ ఎలా వచ్చిందంటే... నాకు నచ్చిన సినిమాలు రాలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలు నచ్చక నేను చేయలేదు. ఇలా రెండు విధాలుగా నాకు బ్రేక్ వచ్చింది. ఎన్నో కథలు విన్న తర్వాత ఈ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథ చెప్పారు కమల్. కథ, స్క్రిప్ట్పై మేం ఇద్దరం ఏడాది పాటు వర్క్ చేశాం. కంటెంట్ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘పూరిగారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నవీన్కు మంచి కమ్బ్యాక్ మూవీలా ఉంటుంది’’ అన్నారు కమల్ తేజ నార్ల. ‘‘ఇందులో నేను లక్ష్మీ అనే ΄ాత్రలో నటించాను’’ అని చె΄్పారు రాశీ సింగ్. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్.


