breaking news
tribal day
-
గిరిజనుల గోడు.. వినేదెవరు?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. దీనికితోడు ఏ కార్యక్రమం అయినా కేంద్ర నిధులే దిక్కన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా సమీక్షలు.. సమావేశాలతోనే కాలయాపన చేయడంతో అడవిలో అలజడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని 1994లో ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. అధికార పీఠమే లక్ష్యంగా వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపరని మరోమారు తేటతెల్లమైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎస్టీలకు ఇచ్చిన 20 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అప్పట్లోనే 50 ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికీ పింఛన్ ఇస్తానని, ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిరి్మస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రత్యేక కమిషన్ వంటి హామీలను మరిచిన చంద్రబాబు.. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించి, అటవీ సంపదను దోపిడీదారులకు దోచి పెట్టడానికి కొమ్ముకాయడంతో గిరిజనుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లోనూ 50 ఏళ్లకే పింఛన్, సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయడం, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా వాటి అతీగతీ లేదు. వన్ ఆఫ్ సెవెంటీ, పీసా చట్టాల అమలులోనూ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. నకిలీ గిరిజన ధ్రువపత్రాలపై విచారణ, తుది తీర్పులకు కాలయాపన శాపంగా మారింది. విద్య, ఉపాధి, వైద్యం అన్నింటా ఉత్తుత్తి మాటలతో కూటమి నేతలు మోసం చేయడంపై అడవిలో ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ ఎప్పుడు? జీవో నెంబర్ 3ను పునరుద్ధరించడంపై ఏడాదికిపైగా కాలయాపనతో సరిపెడుతోంది. ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా జారీ చేసిన ఈ జీవోను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దాన్ని పునరుద్ధరిస్తామంటూ మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పటికీ మభ్య పెడుతున్నారు. దీంతో ఈ జీవోను పునరుద్ధరించి, తమకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తా త్కాలికంగా గిరిజనుల ఆందోళనను విరమించేలా చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో మాత్రం తాత్సారం చేస్తోంది. మంత్రి తొలి సంతకానికి దిక్కులేదు.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన తొలి సంతకానికి దిక్కులేకుండా పోయింది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం పార్వతీపురం కలెక్టర్ వద్ద గిరిజన విద్యార్థులు ఆందోళన నిర్వహించడం గమనార్హం. గిరిజన ఉత్పత్తులకు దక్కని ధరలు గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన కాఫీ సాగును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును విస్తరిస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాఫీ తోటలను బాగు చేసుకునేందుకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో దాన్ని తిరిగి సాధించేందుకు ఎన్డీఏ పక్షంలోని టీడీపీ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్లో స్థానిక ఐటీడీఏ, జీసీసీలు సైతం విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది అరకు కాఫీకి మంచి ధర సాధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన రైతులకు శాపంగా మారింది. చింతపండు, తేనె వంటి వాటితోపాటు ఇతర పంటలకు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంలోనూ వైఫల్యంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులకు మేలు కలుగుతోంది. గిరిజనులు అధిక ఉత్పత్తులు సాధించేలా తగిన పరికరాలు సబ్సిడీపై అందించడం, వారి ఉత్పత్తులకు సరైన ధర దక్కేవరకు నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఫలితంగా వారి బతుకు చిత్రం మారింది. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఏకంగా 3.22 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం గిరిజనులకు పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. అంతర పంటగా మిరియాలు, ఇతర పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు వంటివి అందించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఆ ఐదేళ్లు గిరిజనులు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ విషయాన్ని తలుచుకుంటూ ప్రస్తుతపరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డోలీ నిర్మూలన మాటలకే పరిమితం ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి డోలీ మోతలను నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గతేడాది డిసెంబర్లో ఏజెన్సీలో రెండు రోజులపాటు పర్యటించి, రోడ్లు వేస్తున్నట్టు శంకుస్థాపనలతో హడావుడి చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రోడ్డు వేయక పోవడంతో డోలీ కష్టాలు తీరడం లేదంటూ గత నెలలో గిరిజన యువకులు గుర్రాలపై గ్రామాల్లో తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఏజెన్సీలో మాడ్రేబు నుంచి పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో రోడ్లు వేసి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. -
అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం
కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్ నాయక్, డాక్టర్ హెచ్కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు. -
గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా
సాక్షి, అమరావతి: అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ట్వీట్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘దేశీయంగా ఉన్న విభిన్న జాతులకు ఆంధ్రప్రదేశ్ నిలయం. మా గిరిజన వారసత్వం గురించి మేము గర్విస్తున్నాము. వారి సంస్కృతి, గిరిజన జాతిని ఉద్ధరించడానికి, సంరక్షించడానికి మా శక్తి సామర్థ్యం మేరకు అన్నీ చేస్తున్నాము. కోవిడ్–19 వల్ల గిరిజనులకు పంపిణీ చేయాల్సిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అక్టోబర్ 2కి వాయిదా వేశాము. అదే రోజు కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నాము. అదే రోజు ఏడు ఐటీడీఏల పరిధిలో ఏడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాము.’’ -
'గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తాం'
సాక్షి, అమరావతి : ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడతాన్నారు. -
గిరిజనుల నుంచి నాగరికులు ఎంతో నేర్చుకోవాలి
పర్యావరణంలో ఒక భాగంగా జీవించే గిరిజనుల జీవన విధానం నుంచి పట్టణ ప్రజలు, నాగరికులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రొ. శివప్రసాద్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన సంస్కృతిని కోల్పోతున్నామని, ఆరోగ్యకరమైన అతి ప్రాచీనమైన ఈ మూలాలు గిరిజనుల్లోనే ఉన్నాయన్నారు. వాటిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనులు ప్రస్తుతం నాగరికులమని చెప్పుకుంటున్న నాగరికులకంటె అధికులని పేర్కొన్నారు. గిరిజనులు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రకృతికి, సాటి ప్రజలకు మేలు చేకూర్చేవిగా ఉంటాయని, అందువల్ల వారి విజ్ఞానాన్ని రికార్డు చేసుకుని గిరిజనేతరులంగా పాటించాలని సూచించారు. మంగళవారం సంక్షేమభవన్లోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.గిరిజనులు బాగు పడాలంటే విద్యాసౌకర్యాలను వారి వద్దకు తీసుకెళ్లాలని, వారి మృతృభాషల్లో బోధించే ఉపాధ్యాయులతోనే ఎస్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాని ప్రొ.సూర్య ధనుంజయ్ అన్నారు. ఎస్టీ శాఖ రూపొందిస్తున్న తెలంగాణ గిరిజన సంస్కృతి సూచీ (ఇన్వెంటరీ) కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఎస్టీ శాఖ రూపొందించిన గోండు, గోండు సంబంధిత తెగల కుల పురాణ చిత్రలేఖనాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ డెరైక్టర్ డా. నవీన్ నికొలస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డా. ద్యావనపల్లి సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
నిలదీస్తారేమోనని వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
పార్వతీపురం (విజయనగరం): ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలపై అప్రజాస్వామిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఆదివాసీ దినోత్సవాలకు రాష్ట్ర మంత్రులు మృణాళిని మరికొందరు రాబోతున్నారు. అయితే, ప్రజలకిచ్చిన హామీల అమలుపై వైఎస్సార్ సీపీ నేతలు మంత్రులను నిలదీస్తారని, ఆందోళన చేస్తారని ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం.రవికుమార్ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5 వేల ఆదివాసీ తెగలున్నాయి. 6,700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి 1993లో తీర్మానించింది. ఈ తీర్మానం అమలులో భాగం గా.. అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో అంతం కాబోతోంది. మన దేశ పార్లమెంటులో 30 మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమస్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగుతోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రాజ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్ ఇండియన్లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథాలో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈ చరిత్రను మన దేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో సహజవనరులను, ఖనిజ సంపదనూ ధ్వంసం చేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా మధ్యభారతం కేంద్రంగా ఉన్న ఆదివాసీలు నడిపే ప్రత్యామ్నాయ పరిపాలన (మావోయిస్టుల ఆధ్వర్యంలోని జనతన్ సర్కార్)లో భాగమైన ఆదివాసులు జల్, జంగిల్, జమీన్నూ ఉమ్మడి జీవన విధానాన్ని రక్షించుకోవటంలో తమ ప్రాణాలనే బలిపెడుతున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమయ్యాయి. రాచరికపు మహా సామ్రాజ్యాలు కూడా ఆదివాసుల విషయంలో చేయనంత మహా విధ్వంసాన్ని ఓపెన్ కాస్టుల పేర అత్యాధునిక రాజ్య వ్యవస్థ చేస్తోంది. ఆనకట్టలు, ప్రాజెక్టులు, మైనింగ్.. ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవుతున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రా ణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరి భాషకు గుర్తింపు లేదు. ప్రాణాల కు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈ శ్మశాన వాటికల్లో ఆదివాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ, వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాలకవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకల వర్గాల ప్రజలూ అండగా నిలవాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈ సమాజానికీ, చరిత్రకీ, సంస్కృతికీ, సంప్రదాయాలకూ చాలా ప్రమాదం. (రచయిత: వూకే రామకృష్ణ ) ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ, మొబైల్ : 9866073866