breaking news
sp Ranga nath
-
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
ఖమ్మం క్రైం, న్యూస్లైన్: ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఖమ్మంనగరంతో పాటు శివారు మండలాల్లో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఖమ్మంనగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్లతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీశ్రీ విగ్రహం వద్ద కారులో కారులో తరలిస్తున్న 260 కిలోల గంజాయి, ఒక చనిపోయిన కుందేలు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం బైపాస్ రోడ్డులో అనుమానంతో 8 మంది మహిళలను, ఒక ఆటోను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 50వ డివిజన్లోని దానవాయిగూడెంలో నల్లబెల్లం, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచ్ర క వాహనాలు, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశ్రీ విగ్రహం, ఎన్టీఆర్ సర్కిల్, ఎన్నెస్పీ విశ్రాంతి భవనం, బోనకల్లు రోడ్డు, కాల్వోడ్డు, తదితర రహదారులతో పాటు మమత ఆస్పత్రి కాల్వకట్ట పరిసరా ల్లో, యుపీహెచ్కాలనీ, బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప, దానవాయిగూడెం, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుం డా వెళ్తున్న గ్రానైట్ లారీని అదుపులోకి తీసుకున్నారు. 52 వాహనాలు సీజ్.. ఖమ్మంలో సరైన పత్రాలు, ఇన్సూరెన్స్, లెసైన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 52 వాహనాలను సీజ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆరువందల మందిచే తనిఖీలు : డీఎస్పీ బాలకిషన్రావు ఖమ్మం అర్బన్ : ఖమ్మంసబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారుల్లో 600 మంది పోలీసులు నాకాబంధీ నిర్వహించారని డీఎస్పీ బాలకిషన్రావు పేర్కొన్నారు. ఖమ్మంఅర్బన్ పోలీస్స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఓఎస్డీ తిరుపతి, తనతో పాటు 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 200 మంది స్పెషల్ పార్టీ, 400 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో మహిళా స్టేషన్ సీఐ ప్రతాప్, అర్బన్ తహశీల్దార్ అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు. 26 వాహనాలు, రూ.6లక్షల నగదు స్వాధీనం నేలకొండపల్లి: జిల్లా సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల్లో కూసుమంచి సీఐ పింగళి నరేష్రెడ్డి,నేలకొండపల్లి ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఓ వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 4లక్షలను, మరో వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 1.76లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 26 వాహనాలను సీజ్ చేశారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ ఆర్.కె.నాయుడు, వెగ్గళం శ్రీధర్చారీ, సిబ్బంది మన్సూర్ఆలీ, నరసింహారావు, నాగులు, వి.నాగేశ్వరరావు, విజయ్, ఆజమత్ ఆలీ, హోంగార్డ్లు మారగాని రమేష్, ప్రకాష్, శ్రీను పాల్గొన్నారు. చర్లలో .. చర్ల: మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలిరావడంతో వారి మాటున మావోయిస్టు సానుభూతిపనులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. సంతకు వచ్చే ఆదివాసీలతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించి విడుదల చేశారు. ఈ తనిఖీలలో సీఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.