-
రోడ్లపై ‘స్మార్ట్ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..!
అతి ఎప్పుడూ నష్టమే.. అవసరానికి వాడుకోవాల్సిన వస్తువుని కాలక్షేపానికి వాడుకోవడం మొదలెడితే వ్యసనం కాక మరేమవుతుంది..! అదే జరుగుతోందిప్పుడు. స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు దానికి బానిసలైపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాటు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తోందనీ, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, ట్యాబ్లాంటి తెరల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలంటున్నారు. అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఖరికి పడుకున్నా చేతిలో ఫోను ఉండాల్సిందే. రోడ్డు మీద నడుస్తున్నా, కారు నడుపుతున్నా మరోపక్క ఫోనూ పనిచేయాల్సిందే. సవ్యసాచిలా రెండు పనులూ ఒకేసారి చేస్తున్నామనుకుంటున్నారు కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. తాజాగా రోడ్లపై ఫోన్ వినియోగిస్తున్నవారిని ‘జాంబీ’లుగా అభివర్ణిస్తూ బెంగళూరు పోలీసులు ఏకంగా హోర్డింగ్లు తయారుచేయించారు. ‘స్మార్ట్పోన్ జాంబీలున్నాయి జాగ్రత్త’ అని ఓ సైన్బోర్డ్లో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. This signboard in BLR singlehandedly attacked our entire generation pic.twitter.com/iN2OsuGBE5 — Prakriti (@prakritea17) January 19, 2024 ఈ స్పష్టమైన హెచ్చరికతో ఉన్న సైన్బోర్డ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ప్రభావం ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఫోన్లు డౌన్, హెడ్స్ అప్..' అని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కొన్ని సర్వేల ప్రకారం.. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోను వాడుతున్న సగటు భారతీయుడు రోజుకు 70 సార్లు ఫోను తీసి చూస్తున్నాడట. అంటే గంటకు మూడుసార్లు. తీసిన ప్రతిసారీ మూడు నిమిషాలు చూసినా రోజుకి మూడున్నర గంటలపైనే. ఆన్లైన్లో అపరిచితులతో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సగటు కన్నా 11 శాతం ఎక్కువ. పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం ప్రపంచ సరాసరి 76 శాతం కాగా, మనదేశంలో 83. సైబర్ బెదిరింపులూ దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచ సగటు 57 శాతం కాగా భారత సగటు 47. ఇంత తీవ్రమైన అంశాల్నీ పట్టించుకోని నిర్లక్ష్యం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. -
సంసారంలో ‘స్మార్ట్’ తిప్పలు.. టెన్షన్ పెడుతున్న రిపోర్టు!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. రిపోర్టులోని ముఖ్యాంశాలు - అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. - స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. - తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. - స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది అంగీకారం. - అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం - ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. - భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. - లివింగ్రూమ్లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం - రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం - జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం - తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు - రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్టైమ్పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ . -
జాగో.. ఫోన్ రిపేర్కు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
డిజిటల్ యుగంలో మోసాలకు కూడా టెక్నాలజీ తోడవుతోంది. ఏమరపాటు, నిర్లక్ష్యం, స్వీయతప్పిదాలు నిండా ముంచేస్తున్నాయి. చాలామంది ఫోన్ రిపేర్కు ఇచ్చే సమయంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వాటి వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. స్వీయ తప్పిదంతో తన అకౌంట్ నుంచి రూ. 2 లక్షలకు పైగా డబ్బును పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. సొంతంగా వ్యాపారం నడిపించుకునే ఓ వ్యక్తి(40).. తన స్మార్ట్ఫోన్కి సమస్య రావడంతో అక్టోబర్ 7వ తేదీన దగ్గర్లో ఉన్న రిపేర్కు ఇచ్చాడు. అయితే.. ఫోన్ రిపేర్ కావాలంటే.. సిమ్ కార్డు ఫోన్లోనే ఉండాలని, ఆ మరుసటిరోజు సాయంత్రం వచ్చి ఫోన్ తీసుకోమని సదరు వ్యక్తితో రిపేర్ షాపువాడు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన ఆ మధ్యవయస్కుడు.. సిమ్ కార్డు ఉంచేసి ఫోన్ను ఇచ్చేసి వెళ్లిపోయాడు. కానీ, నాలుగు రోజులైన ఆ రిపేర్ దుకాణం తెరుచుకోలేదు. ఐదవ రోజు షాపులో పని చేసే మరో కుర్రాడు రావడంతో.. అతన్ని నిలదీశాడు బాధితుడు. అయితే తమ ఓనర్ ఊరిలో లేడని.. ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని చెప్పాడు ఆ కుర్రాడు. అనుమానం వచ్చిన బాధితుడు.. బ్యాంక్ ఖాతాను పరిశీలించగా.. అకౌంట్ నుంచి రెండున్నర లక్షల రూపాయలు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు ఉంది. దీంతో ఆ స్టేట్మెంట్ కాపీతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ముంబై(మహారాష్ట్ర) సాకినాక ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని పంకజ్ కడమ్గా గుర్తించారు. చేయాల్సినవి ► ఫోన్ను రిపేర్కు ఇచ్చినప్పుడు సిమ్ కార్డును తప్పనిసరిగా తొలగించాలి. ► కీలక సమాచారం, గ్యాలరీ డేటా లేదంటే ఇంకేదైనా డేటా ఉంటే.. బ్యాకప్ చేసుకోవాలి. ► సెక్యూరిటీ లాక్స్ తొలగించాలి ► Factory Reset ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ► ఈరోజుల్లో ఇంటర్నల్ మొమరీతోనే ఫోన్లు వస్తున్నాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ మొమరీ ఉంటే గనుక తొలగించాకే రిపేర్కు ఇవ్వాలి. ► ఒకవేళ మైనర్ రిపేర్లు అయితే గనుక.. మెయిల్స్, ఇతర సోషల్ మీడియా యాప్స్ లాగౌట్ కావాలి. ► ఫోన్కు ఆండ్రాయిడ్ పిన్ లేదంటే ప్యాటర్న్ లాక్లో ఉంచడం సేఫ్ ► IMEI ఐఎంఈఐ నెంబర్ను రాసి పెట్టుకోవాలి. ► యాప్స్కు సైతం లాక్లు వేయొచ్చు. ► యూపీఐ పేమెంట్లకు సంబంధించి యాప్లకు సెకండరీ పిన్ లేదంటే ప్యాటర్న్లాక్ ఉంచడం ఉత్తమం. ► స్మార్ట్ ఫోన్ వాడకం ఇబ్బందిగా అనిపించిన వాళ్లు.. లింక్డ్ సిమ్లను మామూలు ఫోన్లలో ఉపయోగించడం ఉత్తమం. ► గొప్పలకు పోయి స్మార్ట్ఫోన్లు వాడాలని యత్నిస్తే.. ఆపరేటింగ్ తెలీక ఆ తర్వాత తలలు పట్టుకోవాల్సి వస్తుంది. చేయకూడనివి ► ఫోన్లు రిపేర్కు ఇచ్చేప్పుడు సిమ్ల అవసరం అస్సలు ఉండదు. ఓటీపీ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్ కార్డుతో ఫోన్ ఎట్టిపరిస్థితుల్లో రిపేర్కు ఇవ్వొద్దు. ► సులువుగా పసిగట్టగలిగే పాస్వర్డ్లను పెట్టడం మంచిది కాదు. ► చాలామంది నిత్యం వాడేవే కదా అని.. అన్ని యాప్స్కు పాస్వర్డ్లను సేవ్ చేస్తుంటారు. కానీ, ఫోన్లో పాస్వర్డ్లు అలా సేవ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ► అన్నింటికి మించి ఫోన్లను బయటి వైఫైల సాయంతో కనెక్ట్ చేసి.. ఆర్థిక లావాదేవీలను నిర్వహించకూడదు. పైవన్నీ తెలిసినవే కదా.. చిన్న చిన్న కారణాలే కదా.. వీటితో ఏం జరుగుతుంది లే అనే నిర్లక్ష్యం ‘స్మార్ట్ ఫోన్ల’ విషయంలో అస్సలు పనికి కాదు. ఇక ఖరీదైన ఫోన్ల విషయంలో స్టోర్లకు వెళ్లి రిపేర్ చేయించుకోవడం ఉత్తమం. -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
వయసు 10.. ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలు.. రోజుకు 4 గంటలు
న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్ను, 10.1శాతం మంది ఆన్లైన్లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు 76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్ ఎక్కాకా ఫోన్ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement