breaking news
Sikkas
-
లండన్లో ముగ్గురు సిక్కుల హత్య
లండన్: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్లోని స్కాట్లాండ్ యార్డ్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. -
నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు
వాషింగ్టన్/హూస్టన్: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు. ‘ఓరెగాన్లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శుక్రవారం టెక్సాస్లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్సాల్వడార్ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్ కేర్. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్ చేశారు. -
‘సిక్కాలు’ కావాలి: టీసీఎస్ ఏజీఎంలో డిమాండ్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ నుంచి బోనస్ షేర్లను కోరుతూ ‘మాకు సిక్కాలు కావాలంటూ’ శుక్రవారంనాడిక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో షేర్హోల్డర్లు డిమాండ్ చేశారు. సిక్కా అంటే నాణెం అని అర్థం. అలాగే టీసీఎస్ ప్రత్యర్థి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ పేరు కూడా విశాల్ సిక్కా. ఈ రెండూ కలిపి ధ్వనించేలా షేర్హోల్డర్ల నుంచి వచ్చిన డిమాండ్కు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ బదులిస్తూ బోర్డు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. కంపెనీ నగదు నిల్వలతో పోలిస్తే మూలధనం తక్కువగా వున్నందున పలువురు షేర్హోల్డర్లు బోనస్ షేర్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఐటీ పరిశ్రమలో యూనియన్ల ఏర్పాటును అనుమతించడం వల్ల తమ కంపెనీపై ప్రభావం ఏదీ పడదని మరో ప్రశ్నకు మిస్త్రీ బదులిచ్చారు.