breaking news
SIEMENS
-
అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ హెల్తినీర్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ, చికిత్స మొదలైన వాటికి కృత్రిమ మేథ (ఏఐ), అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతాయి. ఏఐని ఉపయోగించి, గాటు పెట్టకుండా కాలేయ వ్యాధికి చికిత్సను అందించే దిశగా సీమెన్స్ హెల్తినీర్స్తో భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. వ్యాధులను సకాలంలో కచి్చతంగా గుర్తించేందుకు, మెరుగైన చికిత్సను అందించేందుకు, పేషంట్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీలు తోడ్పడతాయని సీమెన్స్ హెల్త్కేర్ ఎండీ హరిహరన్ సుబ్రమణియన్ చెప్పారు. -
సీమెన్స్ ఎనర్జీ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ఎనర్జీ బిజినెస్ను విడదీసే ప్రతిపాదనను పూర్తి చేసేందుకు దేశీయంగా సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం సీమెన్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు తెలియజేసింది. ఎనర్జీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పూర్తి చేయవలసిందిగా సీమెన్స్ లిమిటెడ్ బోర్డును ప్రమోటర్ సంస్థలు సీమెన్స్ యాక్టింగిసెల్షాఫ్ట్(జర్మనీ), సీమెన్స్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ, సీమెన్స్ ఎనర్జీ హోల్డింగ్ బీవీసహా ప్రధాన ప్రమోటర్ సీమెన్స్ ఎనర్జీ యాక్టింగిసెల్షాఫ్ట్ కోరినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతిపాదనపై పరిశీలన, విలువ నిర్ధారణ, తదితర అవసరమైన చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. వెరసి వెనువెంటనే పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు నిర్ణయించినట్లు వివరించింది. ఎనర్జీ విడదీత వార్తలతో సీమెన్స్ షేరు ఎన్ఎస్ఈలో 6% జంప్చేసి రూ. 4,138 వద్ద ముగిసింది. -
సీమెన్స్లో 15,000 ఉద్యోగాల కోత!
బెర్లిన్: వచ్చే ఏడాది(2014)లోగా ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాలలో కోత పెట్టనున్నట్లు జర్మన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ దిగ్గజం సీమెన్స్ తెలిపింది. వీటిలో 5,000 మంది వరకూ ఉద్యోగులను ఒక్క జర్మనీలోనే తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. వ్యయాల కోతలో భాగంగా సిబ్బందిని తగ్గించుకోనున్నామని కంపెనీ పేర్కొంది. తద్వారా 810 కోట్ల డాలర్లను(రూ. 51,000 కోట్లు) ఆదా చేయనున్నట్లు వివరించింది. కంపెనీ గ్యాస్ టర్బైన్లు, రైల్ పరికరాలు, హెల్త్కేర్, ఎలక్ట్రానిక్ ఆధారిత పలు ఉత్పత్తులను తయారు చేస్తుంది. కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 3,70,000 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 1,19,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. తొలుత ఈ ఏడాది(2013) చివరికల్లా 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత్లో కూడా సీమెన్స్కు అనుబంధ సంస్థ ఉంది.