శుభ ముద్గల్కు ‘సద్భావన పురస్కారం’
న్యూఢిల్లీ: సామాజిక సామరస్యం, శాంతి వ్యాప్తికి కృషి చేసినందుకుగాను గాయని శుభ ముద్గల్కు 23వ రాజీవ్గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని సలహాకమిటీ సభ్యకార్యదర్శి మోతీలాల్ వోరా గురువారం వెల్లడించారు.
రాజీవ్గాంధీ జయంతి రోజైన ఆగస్టు 20న ఇచ్చే ఈ పురస్కారం కింద విజేతకు రూ.10 లక్షల నగదు అందజేస్తారు. ఈ పురస్కారం ఏర్పాటు చేసినప్పటి నుంచి సోనియా గాంధీ ప్రదానం చేస్తున్నారు.