-
Forbes India 30 Under 30 2024: నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ కి చెందిన అంకుర సంస్థ నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు 2024 సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచి్చనందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్కు చెందిన శశాంక్ గుజ్జుల ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవగా.. ఏలూరుకు చెందిన అనుపమ్ పెదర్ల ఐఐటీ ఖరగపూర్లో బీటెక్ పూర్తి చేశాడు. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నట్టు గుర్తించిన వీరు, సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గొప్ప ఉద్యోగావకాశాలను కాదనుకొని గోదావరిఖనికి చెందిన రాహుల్ అత్తులూరితో కలిసి నెక్ట్స్వేవ్ను స్థాపించారు. యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీలలో నైపుణ్యాలు పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకునే దిశగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లలోనే దేశ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్సŠట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల నిధులను సొంతం చేసుకుంది. బహుళజాతి సంస్థలు సహా 1700 లకు పైగా కంపెనీలు వేలాది నెక్ట్స్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. ఈ సందర్భంగా నెక్సŠట్ వేవ్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ ‘‘నెక్ట్స్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని గొప్ప అవకాశాలకు సొంతం చేసుకునేలా యువతని సిద్ధం చేయడంపైనే ఉండేది. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహంగా మా లక్ష్యం వైపు అడుగు వేయడానికి తోడ్పడుతాయి’’అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నెక్ట్స్ వేవ్ మరో సహ వ్యవస్థాపకుడైన అనుపమ్ పెదర్ల చెప్పారు. -
సీఎం జగన్కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్
సాక్షి, అమరావతి: హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఆ లడ్డూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్లో నిర్వహించిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్గుల్ నివాసి అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా రూ.18.90 లక్షలకు వారిద్దరూ లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్కు కోర్టు ఆదేశం చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
బాలిక కిడ్నాప్.. నిందితుడి రిమాండ్
మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కిడ్నాప్తో మనస్తాపం చెందిన బాలిక ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని బాసిరేగడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ శశాంక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొట్టె శ్రీను(20) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక నగరంలోని చింతల్ ఐడీపీఎల్ కాలనీలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. శ్రీను సోమవారం సాయంత్రం బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో ఎక్కించుకుని ఆమెను నగరంలోని అంబర్పేట్లోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులు శ్రీనుపై అనుమానం వ్యక్తంచేస్తూ మంగళవారం మేడ్చల్ ఠాణాలో కిడ్నాప్ కేసు పెట్టారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. అనంతరం బాలికను ఆమె కుటుంబీకులకు అప్పగించారు. ఆ పరిణామాలతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నగర శివారులోని హర్ష ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement