-
వీడని మిస్టరీ
జాస్మిన్, శ్రీసాయి మృతిపై విచారణ ముమ్మరం నిందితుడు పవన్ చెబుతున్న ఆంశాలపై పోలీసుల దృష్టి జాస్మిన్ సోదరుడు, బంధులను గోప్యంగా విచారణ చేస్తున్న పోలీసులు రేపల్లె : నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి మిస్టరీ వీడలేదు. జాస్మిన్ మృతి ఘటనలో నిందితులుగా ఉన్న వేముల శ్రీసాయి, జొన్న పవన్కుమార్లను చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో శ్రీసాయి మృతిచెందాడు. జాస్మిన్ బంధువులు తీవ్రంగా కొట్టటం వల్లే శ్రీసాయి మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శ్రీసాయి మృతి కేసులో విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జాస్మిన్ మృతి మిస్టరీ మాత్రం మీడలేదు. ఉరి వేసుకుని జాస్మిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు జొన్న పవన్కుమార్ చెబుతున్నాడు. ఆదివారం జాస్మిన్ తన పుట్టినరోజని, ఇంట్లో ఎవరు లేరని, రావాలని శ్రీసాయికి ఆమె స్నేహితురాలితో ఫోన్ చేయించిందని పవన్కుమార్ తెలిపాడు. జాస్మిన్, శ్రీసాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమని, దీంతో శ్రీసాయి, తాను జాస్మిన్ ఇంటికి వెళ్లామని చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో ఉండగా... జాస్మిన్ ఇంటి నుంచి తాను, ఆమె స్నేహితురాలు బయటకు వెళ్లిపోయామని పవన్కుమార్ చెబుతున్నాడు. ఇంట్లో శ్రీసాయి, జాస్మిన్ ఉన్న సమయంలో ఆమె బంధువు గౌస్ తలుపు కొట్టగా.. శ్రీసాయిని వెనుక డోర్ నుంచి పంపించిందని వివరించాడు. కొద్దిసేపటికి శ్రీసాయికి జాస్మిన్ ఫోన్ చేసి ‘నీవు ఇంటికి వచ్చిన విషయం గౌస్ చూసి మా అన్నకు పోన్ చేసి చెప్పాడు. మా అన్న నాకు ఫోన్ చేసి తిట్టి చావమన్నాడు. ఇక నాకు బతకాలని లేదు. చనిపోతున్నాను..’ అని చెప్పిందని తెలిపాడు. వెంటనే శ్రీసాయి, తాను వెళ్లి జాస్మిన్ స్నేహితురాలిని కలిసి విషయం చెప్పి వెళ్లి ఏమి చేస్తుందో చూసి రావాలని పంపామని చెప్పాడు. అమె ఇంట్లోకి చూసే సరికి జాస్మిన్ ఫ్యాన్కు ఉరి పెట్టుకుని ఉన్నట్లు వచ్చి చెప్పిందని, వెంటనే వెళ్లి పక్కనే ఉన్న ఇద్దరు వృద్ధులకు విషయం చెప్పి, ఇంట్లోకి వెళ్లి జాస్మిన్ ఉరి పోసుకున్న చీరను శ్రీసాయి ఒక్కడే తొలగించి, 108కు ఫోన్ చేశాడని పవన్ పోలీసులకు వివరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గౌస్ తమను ఇంట్లోకి నెట్టి ఇంటి తలుపులకు గడియపెట్టినట్లు చెప్పాడు. పవన్కుమార్ బెబుతున్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టి లోతుగా విచారణ చేస్తున్నరు. పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాల చర్చలు జాస్మిన్ పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాలుగా చర్చ సాగుతోంది. పోస్టుమార్టం ప్రథమిక రిపోర్టు వైద్యాధికారుల నుంచి అందలేదని, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జాస్మిన్, శ్రీసాయి మృతిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీఎస్పీ పి.మహేష్ తెలిపారు. శ్రీసాయికి కన్నీటి విడ్కోలు మహ్మదీయపాలెం గ్రామస్తుల ఆగ్రహానికి బలైన వేముల శ్రీసాయి(18)కి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అడవులదీవి గ్రామంలో శ్రీసాయి అంత్యక్రియలు నిర్వహించారు. జాస్మిన్, వేముల శ్రీసాయి మృతితో రెండు రోజులుగా అడవులదీవిలో సెక్షన్-144 అమల్లో ఉంది. అడవులదీవిలో బంద్ నిర్వహించారు. -
హత్యా.. ఆత్మహత్యా...
యువతి అనుమానాస్పద మృతి అత్యాచారయత్నం చేసి హతమార్చారంటూ ఇద్దరు యువకులను చితకబాదిన స్థానికులు వారిలో ఒకరు మృతి మహ్మదీయపాలెంలో ఘటన... ఉద్రిక్తత నిజాంపట్నం/రేపల్లెరూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా...ఆమెపై అత్యాచారయత్నం చేసి హత్యచేశారంటూ స్థానికులు ఇద్దరు యువకులను చితకబాదడంతో వారిలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెం దాడు. గుంటూరుయ జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయ పాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... మహ్మదీయపాలెంకు చెందిన షేక్ జాస్మిన్ (19) తన తల్లి మెహరునిసా, సోదరులు ఇద్దరూ పొరుగు ఇంటివారి శుభకార్యానికి మట్లపూడి వెళ్లగా ఆదివారం ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్కుమార్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి ఆమెపై అత్యాచారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతో నడుముకు ఉన్న బెల్టును తీసి మెడకు చుట్టి దారుణంగా హతమార్చారని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జాస్మిన్ ఉరివేసుకుంటానంటోందటూ పక్కింట్లో ఉన్న పలువురు వృద్ధులకు శ్రీసాయి,పవన్కుమార్లు తెలపడంతో స్థానికులు వచ్చి చూసేటప్పటికీ జాస్మిన్ కిందపడి మృతిచెంది ఉందని తెలిపారు. ఉరివేసుకోకుండా ఎలా మృతిచెందిందంటూ వీరిద్దరినీ ప్రశ్నించడంతో ఉరివేసుకుని మృతి చెందిందని, తామే తీశామన్నారని తెలిపారు. వంటగదిలో ఉరివేసున్నట్లు వీరిద్దరూ ఆరోపిస్తుంటే బెడ్రూమ్లోని మంచంపై నెత్తుటి మరకలు, తెగిపడిన బెల్టు ఎలా ఉన్నాయంటూ స్థానికులు వారిద్దరినీ చితకబాది చెట్టుకు కట్టివేశారు. వేముల శ్రీసాయి గతంలో పలుసార్లు ఇంటిముందుగా ద్విచక్రవాహనంపై తిరుగుతుండేవాడని, ఇళ్ళలోని దారులలో తిరిగే పని మీకు ఏమిటంటూ పలుమార్లు హెచ్చరించామని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బలాత్కారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి ఒడికట్టి ఉంటారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వేముల శ్రీసాయి బాపట్లలో బీటెక్ చదువుతున్నాడు. జొన్నా పవన్కుమార్ రేపల్లెలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పోలీసులు, స్థానికులకు తోపులాట సంఘటనా స్థలాన్ని అడవులదీవి ఎస్ఐ కాటూరి శ్రీనివాసరావు పరిశీలించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ స్టేషన్కు తరలించేందుకు వీలులేదంటూ మృతురాలి బంధువులు, స్థానికులు అడ్డుపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు, నగరం ఎస్ఐ బి.అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీ నిచ్చారు. అయినప్పటికీ రాజకీయ వత్తిళ్ళతో కేసును తప్పు దోవ పట్టిస్తారని, ఇక్కడినుంచి వారిద్దరినీ తీసుకు వెళితే తమకు న్యాయం జరగదని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పోలీసులు వేముల శ్రీసాయిని, జొన్నా పవన్కుమార్ను తీసుకు వెళుతుండటంతో బంధువులు, స్థానికులు అడ్డగించారు. పోలీసులకు, స్థానికులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు వారిద్దరినీ పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని రేపల్లె సీఐ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులు,బంధువులు జాస్మిన్ హత్యకు గురైందని ఆరోపిస్తున్నారని, ఘటనాస్థలాన్ని పరిశీలించి హత్యగానే తామూ అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగతా విషయాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరి మృతి జాస్మిన్ మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో వేముల శ్రీసాయి (18) మృతి చెందాడు. జాస్మిన్ మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు వేముల శ్రీసాయి, జొన్న పవన్లను తీసుకుని భట్టిప్రోలు వెళ్లగా వేముల శ్రీసాయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు రేపల్లె పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు చెప్పారు. బంధువుల ఆందోళన వేముల శ్రీసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వేముల శ్రీసాయిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ వీరు ఆందోళన చేపట్టారు. రెండు నెలల్లో పెళ్లి.. ఇంతలోనే.. జాస్మిన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాస్మిన్ తండ్రి జిలానీ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లి మెహరునిసా కూలిపనికి వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్దకుమారుడు లారీ డ్రైవర్, చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. జాస్మిన్ 10వ తరగతి చదివి రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు ఇటీవల నగరం మండలం పెదపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగితో వివాహం కుదిరింది.మరో రెండు నెలల్లో వివాహం జరగనున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement