breaking news
red mirchi
-
ఎర్ర బంగారం @ రూ.13 వేలు
ఖమ్మంవ్యవసాయం: మిర్చిని ప్రస్తుత ధరతో చూస్తే ఎర్ర బంగారం అని చెప్పక తప్పదు. మిరప ధర రోజురోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి ధర మంగళవారం క్వింటా రూ. 13,100 పలికింది. జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ‘తేజా’ రకం మిర్చిని ప్రధానంగా సాగు చేస్తుంటారు. ఉభయ జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో ఈ పంటను సాగవుతుంది. దీనికి చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు మిర్చి ఎగుమతులకు అనుమతి లభించటంతో దేశంలో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు అక్కడికి తరలిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా. ఉమ్మడి జిల్లాల్లో పండించిన పంటతో పాటు ఖమ్మానికి పరిసర జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ రూరల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పండించే తేజా రకం మిర్చిని అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు విక్రయిస్తుంటారు. పంట సీజన్లో రైతుల నుంచి క్వింటా రూ. 7,000 నుంచి రూ. 8,500 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ఆ నిల్వలకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. జూన్ నెల చివరి వారంలో రూ. 12 వేలు పలికిన ధర రోజుకో రకంగా పెరుగుతూ వచ్చింది. జూన్ 30న క్వింటా మిర్చి ధర రూ. 12,100 ఉంది. జూలై 9 నాటికి ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ. 13,100కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసే పంట చాలా తక్కువ. వ్యాపారుల పంట మూడు వంతులకు పైగా నిల్వ ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. స్థానిక వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయా వ్యాపారులు ఎగుమతిదారులు(ఖరీదు దారులు)కు నిల్వ పంటను విక్రయిస్తున్నారు. నిల్వ చేసిన వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. క్వింటాకు ఏకంగా రూ. 5 నుంచి 6 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర మరికొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా మిర్చి ధర రూ.13 వేలు పలికింది. ఈ ఏడాది అంతకు మించడం విశేషం. -
ఆ నటి ఏం చేసింది?
హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమయ్యారు. త్రిశూల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ పేరుతో పీవీఎన్ సమర్పణలో నైస్ మూవీస్ సంస్థపై కనసుగారకరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ - ‘‘సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. వీణా మాలిక్ అద్భుతంగా నటించారు. అలాగే, ప్రతినాయిక పాత్రలో సన అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కన్నడంలో నూటయాభై రోజులాడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, దర్శకత్వం: త్రిశూల్. -
రెడ్ మిర్చి మూవీ స్టిల్స్
-
అగ్రస్థానానికిఎదగడం కోసం...
హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమైంది. ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ టైటిల్తో కన్నడ దర్శకుడు కనసుగార కరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ -‘‘సినిమా రంగంలో అగ్రస్థానానికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది? అనేదే ఈ చిత్రకథ. ఇందులో వీణా మాలిక్ అద్భుతంగా నటించింది. అలాగే, ప్రతినాయకురాలి పాత్రను సన చేసింది. కన్నడంలో ఈ చిత్రం 150 రోజులాడింది. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, సమర్పణ: పి.వి.ఎల్, దర్శకత్వం: త్రిశూల్.