breaking news
Ransomeware
-
ఏసర్ యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!) భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. -
సినిమానే హ్యాక్ చేశారు
లాస్ఏంజెల్స్: రాన్సమ్వేర్ హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. గత రెండు రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రామ్సన్వేర్ హ్యాకర్లు ప్రముఖ హాలీవుడ్ చిత్రం పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమా వీడియోని తస్కరించారు. వాల్ట్డిస్నీ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మించింది. సినిమా ఆన్లైన్లో విడుదల కాకుండా ఉండటానికి హ్యాకర్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ఆన్లైన్లో ఉంచుతామని బెదిరిస్తున్నారు. అయితే స్టూడియో సీఈవో బాబ్ ఐగర్ అంత మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. హ్యాకర్లు మొదట 5నిమిశాల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారని, అడిగినంత మొత్తంలో చెల్లించకపోతే 20 నిమశాల వీడియోని రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్లో ఐదో భాగం "డెడ్మెన్ టెల్ నో టేల్స్" పేరుతో నిర్మించారు. జాన్డెప్ ప్రధాన పాత్ర పోషించిన ఈచిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.