breaking news
plane travel
-
కొత్త మార్గాల్లో... ఉడాన్
ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఉడాన్ మూడో రౌండ్ బిడ్డింగ్లో ఎంపిక చేసిన విమాన ప్రయాణ మార్గాల ద్వారా తెలంగాణ, ఏపీ నుంచి మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 235 రూట్లను కేంద్ర పౌర విమానయాన మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈసారి పర్యాటక శాఖ సహకారంతో పలు ప్రాంతాలను ఉడాన్లో ఎంపిక చేశారు. 6 వాటర్ ఏరోడ్రమ్స్ ద్వారా కొత్తగా 18 రూట్లలో సీప్లేన్స్కు కూడా అనుమతించారు. వీటిలో తెలంగాణలోని నాగార్జునసాగర్ వాటర్ ఏరో డ్రమ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కు, విజయవాడకు విమానయాన సౌకర్యం ఏర్పడనుంది. ఈ మార్గాన్ని టర్బో ఏవియేషన్కు కేటాయించారు. –సాక్షి, న్యూఢిల్లీ -
విమానమెక్కిన సింహాలు
ఎక్కడైనా పాములు, కప్పల లాంటి వాటిని స్మగ్లింగ్ చేయడం చూశాం. కొన్నిచోట్ల నక్షత్ర తాబేళ్లను కూడా స్మగుల్ చేస్తారు. కానీ.. సింహాలు విమానంలో వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? ఒకటి కాదు.. రెందు కాదు.. ఏకంగా 33 సింహాలు ఒకేసారి విమానం ఎక్కాయి. కొలంబియా, పెరూ దేశాలలోని సర్కస్ కంపెనీలలో హింసకు గురవుతున్న వీటన్నింటినీ అధికారులు రక్షించి, దక్షిణాఫ్రికాకు తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో సింహాలను విమానంలో తీసుకెళ్లడం ఇదే మొదలని జంతుహక్కుల సంఘాల వాళ్లు అంటున్నారు. జ్యూస్, షకీరా అనే పేర్లు గల సింహాలను పెరూ, కొలంబియా సర్కస్ కంపెనీల నుంచి కాపాడారు. కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురవుతున్న ఈ సింహాలు ఎట్టకేలకు మళ్లీ తమ మాతృభూమి అయిన ఆఫ్రికా అడవులకు వెళ్తున్నాయని, ఇది ఎంతో ఆనందకరమైన విషయమని యానియల్స్ డిఫెండర్స్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) అధ్యక్షుడు జాన్ క్రీమర్ చెప్పారు. సర్కస్ కంపెనీల నుంచి తీసుకొచ్చిన సింహాలన్నింటికీ ఆరోగ్యసమస్యలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటికి తగినంత ఆహారం కూడా పెట్టేవారు కాదని, అందువల్ల వాటికి పోషకాహార లోపాలు ఉన్నాయని అన్నారు. పెరూ నుంచి 24 సింహాలను కాపాడారు. వాటిని లిమా విమానాశ్రయంలోని తాత్కాలిక సంరక్షణ కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ఓ కార్గో విమానంలో ఆఫ్రికా తీసుకెళ్తున్నారు. మరో తొమ్మిది సింహాలను కొలంబియా నుంచి తెస్తున్నారు. వీటిలో ఒక సింహానికి ప్రముఖ కొలంబియా పాప్ గాయని షకీరా అని పేరు పెట్టారు.