breaking news
pasam sunil kumar
-
రౌడీషీటర్ జన్మదిన వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘అరాచకాలు సృష్టించడం.. రౌడీయిజం చేయడం.. దందాలకు పాల్పడటం లాంటివి చేస్తే ఎవరినైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ గత ఎన్నికల ప్రచారంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్కుమార్ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సునీల్కుమార్ వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. లోకేశ్ చెప్పిన విధంగా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయో వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గత వారం గూడూరుకు చెందిన రౌడీషీటర్ కనుపూరు శ్రీహరి (జెమిని) పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్కుమార్ పాల్గొన్నారు. అతడికి కేక్ తినిపించి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జెమిని పట్టణంలో దందాలు చేస్తూ రౌడీషీటర్గా ఉన్నాడు. అతడిపై ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మూడు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీషీటర్లను పెంచి పోషించేలా వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.మనవాళ్లే వదిలేయండి!గూడూరు నియోజకవర్గంలో అధికారం చేట్టిన రోజు నుంచి రౌడీలతోనే పాలన కొనసాగించేలా సంకేతాలు ఇస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ గ్రావెల్, మట్టి, ఇసుక తరలింపులను నేరుగా ప్రోత్సహిస్తూ కమీషన్ల రూపంలో రూ.లక్షలు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీషీటర్ల ద్వారా గంజాయి, పేకాట, జూదం (డైమండ్ డబ్బా) ఆటలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడైనా పట్టబడితే పోలీసులకు ‘మన వారే వదిలేయండి’ అని ఆదేశాలు ఇస్తున్నట్టు పబ్లిక్ టాక్. ఈ క్రమంలోనే పట్టణంలోని పాత నేరస్తులను చేరదీసి వారికి ఏరియాలను అప్పగించినట్టు సమాచారం. దీంతో వారు ఆడిన ఆటకు అటు పోలీసులు కూడా అడ్డు చెప్పడం లేదు.ఆ విషయం తెలియదుజెమినిపై ఉన్న కేసుల విషయమై పట్టణ ఎస్ఐ, సీఐలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. తాము వారం క్రితమే బదిలీల్లో భాగంగా వచ్చామని చెప్పారు. ఎవరిపై రౌడీషీట్లు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయనే విషయాలపై ఇంకా దృష్టి పెట్టలేదని సమాధానం దాటవేశారు. -
పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం చేయొద్దు
గూడూరు రూరల్ : పింఛన్ల ఎంపికలో టీడీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని గూడూరు, సూళ్లూరుపేట, బద్వేలు ఎమ్మెల్యేలు పాశం సునీల్కుమార్, కిలివేటి సంజీవయ్య, జయరాములు హెచ్చరించారు. శుక్రవారం గూడూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. పాశం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి 65 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వికలాంగులందరికీ శాతం పేరిట పింఛన్ల మొత్తంలో కోత విధించడం సరికాదన్నారు. రేషన్ కార్డుల్లో వయస్సు తప్పుగా ఉందని, వాటిని సరిచేసి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. డిసెంబరు వరకు రుణమాఫీని వాయిదా వేయడం చూస్తే రుణమాఫీ అమలయ్యే పరిస్థితి లేదన్నారు. బెల్టు షాపులు నియంత్రిస్తామని చెప్పినా గూడూరు నుంచి నెల్లూరు వరకు డాబాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్నారు. పార్టీలు మారే సంస్కృతి తమది కాదన్నారు. సంజీవయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా టీడీపీ 100 రోజుల పాలనపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పింఛన్ లబ్ధిదారుల ఏరివేత మొదలు పెట్టి టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా ఆదేశాలు రావడం సిగ్గు చేటన్నారు. కమిటీలో అన్ని పార్టీల వారిని సభ్యులుగా నియమించి ఉంటే బాగుండేదన్నారు. జయరాములు మాట్లాడుతూ టీడీపీ ప్రజల ఆదరణ కోల్పోతోందన్నారు. రాష్ట్రంలో 48,11,385 మందికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్లు అందించారన్నారు. బడ్జెట్లో పింఛన్లకు కోత విధించడాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం జీఓ నంబరు 135ను తీసుకువచ్చి గ్రామాల్లో ప్రజల మధ్య కక్షలు పెంచుతుందన్నారు.